Begin typing your search above and press return to search.

నానిని చిరంజీవి సరసన చేర్చేశాడు

By:  Tupaki Desk   |   15 Jan 2017 10:22 AM GMT
నానిని చిరంజీవి సరసన చేర్చేశాడు
X
ఎన్టీఆర్.. ఏఎన్నార్.. కృష్ణ.. చిరంజీవి.. ఇలాంటి దిగ్గజాల సరసన నానిని చేర్చేశాడు ఏస్ ప్రొడ్యూస్ దిల్ రాజు. తెలుగులో స్వశక్తితో గొప్ప స్థాయికి ఎదిగిన హీరోల జాబితాలో నాని ఉంటాడని రాజు అన్నాడు. ‘నేను లోకల్’ ఆడియో వేడుకలో భాగంగా రాజు ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘‘తెలుగు సినిమా పరిశ్రమ పుట్టినపుడు ఎన్టీఆర్.. ఏఎన్నార్.. కృష్ణం రాజు.. శోభన్ బాబు.. వీళ్లందరూ స్వశక్తితో ఎదిగారు. పెద్ద స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత గత 30 ఏళ్లలో సొంతంగా ఏ బ్యాకప్ లేకుండా మెగాస్టార్ అయింది చిరంజీవి అయితే.. ఆ తర్వాత రవితేజ.. ఇప్పుడు నాని అలా ఎదిగారు. నాని తన నటనతో నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు. ఎప్పట్నుంచో నానితో సినిమా చేయాలుకుంటే ఇప్పటికి కుదిరింది. కీర్తి సురేష్ ‘నేను శైలజ’ లాంటి మంచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇప్పుడు ‘నేను లోకల్’ చేస్తోంది. త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనూ నటించబోతోంది. ఆమె ఇంకా పెద్ద హీరోయిన్ అవుతుంది.

త్రినాథరావు తీసిన ‘సినిమా చూపిస్త మావ’ నాకు బాగా నచ్చేసి సొంతంగా రిలీజ్ చేశాను. ఆ సినిమాకు పని చేసిన సేమ్ టీంకు ‘నేను లోకల్’ సినిమాను అప్పగించి.. చేసి పెట్టమన్నాను. చాలా బాగా చేశారు. సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది. ‘శతమానం భవతి’తో ఆల్రెడీ ఈ ఏడాది ఓ హిట్టు కొట్టాం. ఫిబ్రవరిలో ‘నేను లోకల్’తో ఇంకో హిట్టు కొట్టబోతున్నాం’’ అని దిల్ రాజు అన్నాడు.