Begin typing your search above and press return to search.

పదేళ్ల తర్వాత కార్తీ కమర్షియల్ మూవీ ఇదే: సుల్తాన్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   29 March 2021 8:07 AM GMT
పదేళ్ల తర్వాత కార్తీ కమర్షియల్ మూవీ ఇదే: సుల్తాన్ డైరెక్టర్
X
కోలీవుడ్ హీరో కార్తీ గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు కార్తీ. తను నటించే ప్రతి సినిమా తెలుగులోకి డబ్ వెర్షన్ లో విడుదల అవుతుంటాయి. నిజానికి తమిళంతో పాటు తెలుగులో కూడా అద్భుతమైన క్రేజ్ దక్కించుకున్నాడు కార్తీ. యుగానికి ఒక్కడు మొదలుకొని ఖైదీ సినిమా వరకు అన్నీ తెలుగులో భారీరేంజిలో రిలీజ్ అవుతున్నాయి. ఖైదీ సినిమాతో వందకోట్ల క్లబ్ లో చేరాడు కార్తీ. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా విడుదలైన ఖైదీ 2019లో దీపావళి కానుకగా విడుదలై సూపర్ సక్సెస్ అందుకుంది. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా.

వసూళ్లపరంగా కూడా ఖైదీ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాలీవుడ్ లో కూడా ఈ సినిమా రీమేక్ అవ్వనుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కార్తీ నటిస్తున్న కొత్త సినిమా సుల్తాన్. ఇటీవలే ఈ సినిమా టీజర్, ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసాయి. విలేజ్ నేపథ్యంలో తెరకెక్కిన సుల్తాన్.. ఫుల్ యాక్షన్ ప్యాకెడ్ మూవీగా రూపొందిందని టాక్. అయితే ఏప్రిల్ 2న సుల్తాన్ సినిమా విడుదల కాబోతుండటంతో తాజాగా డైరెక్టర్ బక్కియరాజ్ కన్నన్ పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. కార్తీ 2011లో నటించిన 'సిరుతాయ్' (విక్రమార్కుడు రీమేక్) తర్వాత చేసిన మోస్ట్ కమర్షియల్ సినిమా ఇది. ఈ సినిమా అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెప్పాడు. ఈ సినిమాతో రష్మిక మందన తమిళలో అడుగుపెడుతోంది. ఈ సినిమాను కూడా ఖైదీ నిర్మాతలే నిర్మించారు.