Begin typing your search above and press return to search.

చిరంజీవి డ్యాన్స్​.. ఓ డైరెక్టర్​కు కోపం తెప్పించిందట..!

By:  Tupaki Desk   |   7 Dec 2020 11:30 PM GMT
చిరంజీవి డ్యాన్స్​.. ఓ డైరెక్టర్​కు కోపం తెప్పించిందట..!
X
తెలుగు ప్రేక్షకులను తన డ్యాన్స్ లతో ఉర్రూతలూగించిన నటుడు చిరంజీవి. అప్పటివరకు ఉన్న మూస తరహా డ్యాన్స్​లకు నటనకు చిరు పక్కనపెట్టాడు. ఒక్కసారిగా తెలుగు తెరమీద చిరు.. బ్రేక్​ డ్యాన్స్​లు చేస్తుండటంతో కుర్రకారు పిచ్చెక్కిపోయింది. ఆ తర్వాత ఆయన తెలుగులో నంబర్​ 1 స్టార్ హీరో​గా ఎదిగాడు.

చిరంజీవి డ్యాన్స్​లు, ఫైట్​లు అంటే ఇప్పటికీ ఎంతో క్రేజ్​ ఉంది. దీంతో ఆయనకు విపరీతమైన మాస్​ ఫాలోయింగ్​ వచ్చేసింది. అయితే ప్రారంభంలో చిరంజీవి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. హీరోగా ఎంట్రీ ఇచ్చే కంటే ముందు చిన్న చిన్న వేషాలు, విలన్​ పాత్రల్లోనూ నటించాడు. అయితే సరిగ్గా అదే సమయంలో చిరంజీవి చేసిన ఓ డ్యాన్స్​ దర్శకుడికి కోపం తెప్పించదట. చిరంజీవి ఫస్ట్​ సినిమా పునాది రాళ్లే అయినప్పటికీ ముందు ఆ సినిమా రిలీజ్​ కాలేదు. ఆ తర్వాత షూటింగ్​ ప్రారంభించిన ప్రాణం ఖరీదు చిత్రమే ముందు థియేటర్లలోకి వచ్చింది.

ఈ సినిమాలో చిరంజీవి తోపాటు చంద్రమోహన్​, జయసుధ నటించారు. ఈ సినిమాకు కే వాసు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా షూటింగ్​ సందర్భంగా చిత్ర యూనిట్​ మొత్తం రాజమండ్రిలోని అప్సరా హోటల్​లో బసచేశారట.

డైరెక్టర్​ వాసు రెండో ఫ్లోర్​లో ఉండగా.. చిరంజీవి మిగతా నటులు, సిబ్బంది మొదటి ఫ్లోర్​లో బసచేశారట. అయితే రాత్రి అందరూ పడుకున్న సమయంలో చిరంజీవి తన గదిలో పెద్దగా టేప్​ రికార్డర్​లో పెద్దగా సౌండ్​ పెట్టుకొని ప్రాక్టీస్​ చేసేవాడట. దీంతో నిద్రకు డిస్టర్బ్​ అయి పీ వాసు చాలా సార్లు విసుక్కొనేవాడట.

అసిస్టెంట్స్ డైరెక్టర్స్ వచ్చి సార్​ మన సినిమాలో నటిస్తున్న చిరంజీవి అనే కుర్రాడు డాన్స్​ ప్రాక్టీస్​ చేస్తున్నాడు అని సర్దిచెప్పారట. అయితే ప్రాణం ఖరీదు చిత్రం 45 రోజుల పాటు చిత్రీక‌రించారు. ఈ సినిమా కమర్షియల్​గా పెద్దగా హిట్​ కాకపోయినప్పటికీ చిరంజీవికి మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత చిరంజీవి తెలుగులో టాప్​ హీరోగా ఎదిగాడు.