Begin typing your search above and press return to search.

సినిమా విడుదలైపోతోందని బాధపడుతున్నాడు

By:  Tupaki Desk   |   12 April 2015 11:30 PM GMT
సినిమా విడుదలైపోతోందని బాధపడుతున్నాడు
X
అనుకున్న సమయానికి సినిమా విడుదల కావట్లేదని ఫీలయ్యే హీరోలుంటారు. కానీ మమ్ముట్టి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ మాత్రం తన సినిమా విడుదలైపోతోందే అని బాధపడుతున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో తాను నటించిన 'ఓకే బంగారం' గురించే దుల్కర్‌ బాధంతా. ఇంతకీ అతడి ఆవేదనేంటో తెలుసుకుందాం పదండి.

''గత ఏడాది కాలంగా జరుగుతున్నదంతా కలలాగే ఉంది. ఎప్పటికీ మేలుకోకుండా అలాగే ఉండాలనిపించే కల ఇది. ఎప్పుడూ ఇందులోనే ఉండిపోవాలనిపించిన కల ఇది. ఓకే కణ్మణి సినిమాకు పని చేసింది డ్రీమ్‌ టీమ్‌. మణిరత్నం, పీసీ శ్రీరాం, రెహమాన్‌ లాంటి లెజెండ్స్‌తో పని చేయడం ఓ మ్యాజిక్‌. ఈ సినిమా పూర్తయిపోయాక చాలా బాధనిపించింది. విడుదలైపోతుంటే ఇంకా బాధగా ఉంది. నేను నా కల నుంచి బయటికి వచ్చేస్తున్నానే అని బాధపడుతున్నా. ఈ సినిమాలో పని చేయడం నా అదృష్టం'' అని దుల్కర్‌ సల్మాన్‌ అన్నాడు. మణిరత్నం సినిమాలో నటించడం లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌లా ఫీలవుతున్నానని చెప్పాడు సల్మాన్‌. నిత్యామీనన్‌ హీరోయిన్‌గా నటించిన ఓకే బంగారం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది.