Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ ఈడీ ముందుకు ర‌కుల్ ప్రీత్ సింగ్!

By:  Tupaki Desk   |   16 Dec 2022 11:40 AM GMT
మ‌ళ్లీ ఈడీ ముందుకు ర‌కుల్ ప్రీత్ సింగ్!
X
అప్ప‌ట్లో టాలీవుడ్ డ్ర‌గ్స్ కేస్ దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ప‌లువురు టాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు ఈడీ నోటీసులిచ్చి విచారించింది. కొంత మంది నుంచి కీల‌క స‌మాచారం రాబ‌ట్టిన‌ప్ప‌టికీ మ‌రికొంత మంది నుంచి ఎలాంటి ఆధారాలు సేక‌రించ‌లేక‌పోయింది. పూరి జ‌గ‌న్నాధ్...ర‌వితేజ‌..ఛార్మీ...ర‌కుల్ ప్రీత్సింగ్....త‌నీష్‌...రానా..ముమైత్ ఖాన్..న‌వదీప్ ..ఓప‌బ్ మేనేజ‌ర్..ర‌వితేజ కారు డ్రైవర్లు కూడా విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 3 న ర‌కుల్ ని ఈడీ విచారించింది. అయితే అదే స‌మ‌యంలో అత్య‌వ‌స‌ర ప‌ని ఉందంటూ విచార‌ణ మ‌ధ్య‌లోనే లేచి వెళ్లిపోయింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ర‌కుల్ కు మ‌ళ్లీ నోటీసులు పంపించారు. మ‌రోసారి ఈడీ విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులు జారీ చేసారు. దీంతో ర‌కుల్ మ‌ళ్లీ ఈడీ ముందుకెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ర‌కుల్ మ‌ధ్య‌లో లేచి వెళ్లిపోవ‌డంతో ఈడీ సందేహాలు బ‌ల‌ప‌డ్డాయి. విచార‌ణ‌కు పూర్తి స్థాయిలో స‌హ‌క‌రించ‌లేద‌ని అప్ప‌టి మీడియా స‌మావేశంలో అధికారులు తెలిపారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఈడి విచార‌ణ‌ చేప‌ట్ట‌డం ఇదే తొలిసారి. మ‌రి ఈసారి విచార‌ణ‌లో ఈడీ ఎలాంటి వాస్త‌వాలు రాబ‌డుతుందో చూడాలి. తాజాగా ర‌కుల్ కి ఇచ్చిన నోటీసులు ఇండ‌స్ర్టీలో హాట్ టాపిక్ గా మారాయి.

ర‌కుల్ తో పాటు మిగిలిన వారికి కూడా మ‌ళ్లీ నోటీసులు ఇస్తారా? అన్న సందేహం తెర‌పైకి వ‌స్తుంది. అప్ప‌ట్లోనే ఈడీ విచార‌ణ‌కు ఎవ‌రూ స‌హ‌క‌రించ‌డం లేద‌ని...ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా రావాల్సిందేన‌ని హెచ్చ‌రించింది. ఆ ప్రాస‌స్ లోనే ముందుగా ర‌కుల్ కి నోటీసులు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. అప్ప‌ట్లో ర‌కుల్ ఎక్కువ‌గా టాలీవుడ్ లో సినిమాలు చేసేంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్క‌డే ఎక్కువ‌గా సినిమాలు చేస్తోంది. ఈడీ విచార‌ణ నేప‌థ్యంలో మ‌ళ్లీ అమ్మ‌డి పేరు టాలీవుడ్ లో హాట్ టాపిక్ మారుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.