Begin typing your search above and press return to search.

ఆ రెండు తర్వాతైనా బ్రేక్ వస్తుందా

By:  Tupaki Desk   |   25 May 2017 11:12 AM IST
ఆ రెండు తర్వాతైనా బ్రేక్ వస్తుందా
X
అంతకు ముందు ఆ తర్వాత చిత్రంతో టాలీవుడ్ ని పలకరించిన భామ ఈషా రబ్బా. ఈ మూవీ సక్సెస్ సాధించినా ఆ తర్వాత పెద్దగా ఛాన్సులు రాలేదు. రెండేళ్ల తర్వాత బందిపోటు అంటూ అల్లరి నరేష్ మూవీలో కనిపించింది. మళ్లీ రెండేళ్లు గ్యాప్ వచ్చేసింది.

ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది ఈ భామ. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన అమీ తుమీ చిత్రంలో ఈషానే లీడ్ హీరోయిన్. ట్యాలెంటెడ్ డైరెక్టర్ మూవీ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా ఫుల్ లెంగ్త్ ఎంటర్టెయినర్ జోనర్ కావడంతో.. జనాలను ఆకట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శ్రీనివాస్ అవసరాల.. అడివి శేష్.. వెన్నెల కిషోర్ లతో పండిస్తున్న కామెడీ చిత్రం ఇది. మరోవైపు సుకుమార్ రైటింగ్స్ లో కూడా ఈషా హీరోయిన్ నటించేస్తోంది.

సుకుమార్ రచనలో కుమారి 21ఎఫ్ తర్వాత వస్తున్న మూవీ దర్శకుడు. హరిప్రసాద్ జక్కా డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రంలో ఈషానే హీరోయిన్. ఈ రెండు సినిమాల పైనా ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. రెండు మూవీస్ రిలీజ్ కి రెడీ అయిపోతున్నాయ్ కూడా. మరి ఈ రెండు చిత్రాల తర్వాతైనా ఈషాకి బ్రేక్ వస్తుందా.. మళ్లీ సినిమాల కోసం గ్యాప్ తీసుకోవాల్సి వస్తుందా అని తేలాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/