Begin typing your search above and press return to search.

ఎవరే.. ఈ మెలోడీతో మైకం తెస్తున్నారే

By:  Tupaki Desk   |   18 Aug 2016 5:32 PM IST
ఎవరే.. ఈ మెలోడీతో మైకం తెస్తున్నారే
X
'ఎవరే.. ఈ హాయికి హృదయం చాలంది..' అంటూ విజయ్ ఏసుదాస్ ఒక పాట పాడుతంటే.. అబ్బో అదిరిపోయిందంతే. అయితే ఇంతకీ ఈ మెలోడీ ఏ సినిమాలోనిది? ఈరోజు పొద్దున్నుండి దాదాపు చాలా రేడియో స్టేషన్లలో.. ఆన్ లైన్లో.. వినిపిస్తున్న ఈ పాట అచ్చం ప్రేమమ్ సినిమాలోని మలరే సాంగులా ఉంది కదూ.. ఇంతకీ ఏంటండీ ఈ పాట కహానీ? పదండి చూద్దాం.

మలయాళ ప్రేమమ్ నుండి టైటిల్ మాత్రమే కాకుండా మలరే అనే హిట్ సాంగును కూడా రీమేక్ చేస్తున్నాడు నాగ చైతన్య. ఈ పాటకు తెలుగులో ఎవరే అంటూ అద్భుతమైన లిరిక్ రాశాడు శ్రీమణి. ఈరోజు ఉదయం ఈ పాట రిలీజ్ చేయగానే దానికి వచ్చిన రియాక్షన్లు మరియు రెస్పాన్స్ అద్భుతం. ఇప్పటివరకు మలయాళం వర్షెన్ పాటను విని పులకించిపోయిన సంగీత ప్రియులు ఇప్పుడు ఈ తెలుగు పాటతో ఏకంగా మైకంలో తేలుతున్నారు. పైగా ఈ పాటలో నాగ చైతన్యతో శృతి హాసన్ రొమాన్స్ ను ఊహించుకుంటే ఇంకా కిక్కొస్తోంది. అయితే మలయాళం సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్ పేరు మలర్.. కాబట్టి పాటను మలరే అంటూ పాడుకున్నారు. ఇక్కడ మాత్రం శృతి పేరేంటో తెలియదు కాని.. ఎవరే అంటూ బాగానే రాశారు. రాజేష్‌ మురుగేశన్ అందించిన ట్యూన్ గురించి వేరే చెప్పేదేముంది.. ఆల్రెడీ సూపర్ హిట్టేగా.

కార్తికేయ ఫేం చందు మొండేటి డైరక్షన్ లో రూపొందుతున్న ప్రేమమ్ రీమేక్ ఆడియో రిలీజ్ ఈ నెలలోనే ఉంటుందని.. ఇకపోతే సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఈరోజు ఉదయం నాగచైతన్య తెలిపాడు.