Begin typing your search above and press return to search.

అలిగిన ఫ్యాన్స్! రామ్- భీమ్ ఎమోజీలేవీ జ‌క్క‌న్నా?

By:  Tupaki Desk   |   12 March 2022 7:36 AM GMT
అలిగిన ఫ్యాన్స్! రామ్- భీమ్ ఎమోజీలేవీ జ‌క్క‌న్నా?
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న తొలి పాన్ ఇండియా సినిమా RRR ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈనెల 25న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా టీమ్ ప్ర‌మోష‌న్స్ లో వేగం మ‌రింత‌గా పెంచనుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా RRR అంత‌కంత‌కు ఎగ్జ‌యిట్ మెంట్ పెంచుతోంది. అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఉత్సాహం నెల‌కొంది. ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు ఇప్పుడు స్పెషల్ సాంగ్ ని టీమ్ విడుద‌ల చేయ‌నుంది. ఈ పాట‌తో ప్ర‌మోష‌న్ మ‌రో లెవ‌ల్ కి చేర‌నుంది. ఇక మూవీ అప్ డేట్స్ వీడియోల‌తో జాత‌ర మొద‌లు కానుంది.

అంతా బాగానే ఉంది కానీ జ‌క్క‌న్న కొన్నిటిని మ‌ర్చిపోయార‌ని అభిమానులు ఆరోపిస్తున్నారు. తాజా ట్రెండ్ లో ట్విట్ట‌ర్ ఈమోజీ ప్ర‌చారం ఎంతో ఉత్కంఠ పెంచుతోంది. అలాంట‌ప్పుడు రామ్ - భీమ్ ఈమోజీని రాజ‌మౌళి ఎందుక‌ని ప‌ట్టించుకోరు? అంటూ నిల‌దీస్తున్నారు ఫ్యాన్స్ . ఈ విష‌యంలో తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. తాజాగా ధనుష్ తమిళ చిత్రం మారన్ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో విడుదలైంది.

ధనుష్ కోసం దాని స్వంత ట్విట్టర్ ఎమోజిని కలిగి ఉంది. ఇది ఈ చిన్న చిత్రానికి ఉత్సాహాన్ని కలిగించడానికి సహాయపడింది. అలాగే ద‌ళ‌ప‌తి విజయ్ న‌టించిన‌ బీస్ట్ ఎమోజీని కలిగి ఉంది. ఇది అభిమానుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ఇలాంటి సమయంలో దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం అయినప్పటికీ రాజమౌళికి ఆర్‌.ఆర్‌.ఆర్ కు సొంత ఎమోజీ ఎందుకు లభించలేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

అభిమానులు రామ్- భీమ్ కోసం ప్రత్యేక ఎమోజీలను కోరుకుంటున్నారు. వాటిని ట్విట్టర్ లో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఇది సరైన సమయం అని నిన‌దిస్తున్నారు. రాజ‌మౌళి తో పాటు ఈ విష‌యంలో తార‌క్ - చ‌ర‌ణ్ కూడా కేర్ తీసుకోవాల‌ని కోరుకుంటున్నారు. అయితే ప్ర‌మోష‌న్స్ లో వేగం ఇప్పుడే క‌దా పెరిగింది. తొంద‌ర్లోనే ఫ్యాన్స్ కోరిక నెర‌వేరేందుకు ఛాన్సుంద‌ని కూడా మ‌రోవైపు టాక్ వినిపిస్తోంది.

చరణ్- ఎన్టీఆర్ లతో పాటు రాజమౌళి ఇదివ‌ర‌కూ ప్రమోషన్స్ ని మరో స్థాయికి తీసుకెళ్లారు. అయితే చివరి నిమిషంలో సినిమా వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ మెల్లగా పుంజుకుంటున్నందున ఇక పై ప్ర‌చారంలో నూత‌న పోక‌డ‌లు చూడనున్నారు జ‌నం. అలిగిన ఫ్యాన్స్ ని సంతుష్టుల‌ను చేసేందుకు రాజ‌మౌళి టీమ్ అలెర్ట్ అవుతుంద‌నే భావిద్దాం.