Begin typing your search above and press return to search.

ఆర్‌ఆర్‌ఆర్‌ థియేటర్ లో ప్లెక్సీ వివాదం.. రోడ్డెక్కిన భీమ్‌ ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   27 March 2022 2:30 AM GMT
ఆర్‌ఆర్‌ఆర్‌ థియేటర్ లో ప్లెక్సీ వివాదం.. రోడ్డెక్కిన భీమ్‌ ఫ్యాన్స్
X
ఆర్‌ఆర్ఆర్ విడుదలకు ముందు రామ్ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ అభిమానుల మద్య సోషల్‌ మీడియాలో రచ్చ జరిగింది. అనకాపల్లి మొదలుకుని అమెరికా వరకు ఇద్దరు హీరోల అభిమానులు సినిమా విడుదల కాకముందు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా విడుదల తర్వాత ఆ గొడవలు తగ్గుతాయని భావించారు. కాని సినిమా విడుదల తర్వాత కూడా అభిమానుల హడావుడి తగ్గడం లేదు.

సినిమా విడుదల అయిన రెండవ రోజు అయిన శనివారం ఎన్టీఆర్‌ అభిమానులు రోడ్డు ఎక్కడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు వెంకటగిరిలోని సెల్యులాయిడ్ థియేటర్ వద్ద ఇద్దరు హీరోల అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్లెక్సీల్లో కొన్ని ప్లెక్సీలను నిన్న రాత్రి కొందరు చించి వేశారు. అందులో ఎక్కువగా ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు ఉండటం తో వివాదం మొదలు అయ్యింది.

ఎన్టీఆర్‌ అభిమానులు ఈ విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున థియేటర్ వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన హీరో కి సంబంధించిన ప్లెక్సీలను.. తాము ఉన్న ప్లెక్సీలను చరణ్‌ అభిమానులు చించారంటూ వారు ఆరోపించారు.

ఆ ప్లెక్సీలు ఎవరు చించారు అనే విషయం తెలియాలి అంటే థియేటర్‌ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌ ను ఇవ్వాలంటూ ఎన్టీఆర్‌ అభిమానులు డిమాండ్‌ చేశారు.

థియేటర్ యాజమాన్యం మాత్రం ఆ సీసీ టీవీ ఫుటేజ్ ను ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో ఎన్టీఆర్‌ అభిమానులు రోడ్డు మీద బైఠాయించి దర్నా నిర్వహించారు. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి కుదుట పడింది. అయితే థియేటర్‌ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు తెలియజేశారు.

ఒక వైపు సినిమాలో ఇద్దరు హీరోలు కుమ్మేస్తే.. బయట వారి అభిమానులు మాత్రం ఇలా గొడవలు పడటం దారుణం. పెద్ద ఎత్తున ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా సూపర్‌ హిట్‌ అయిన ఈ సమయంలో అభిమానులు ఇలా గొడవలు పడటం సరి కాదు అంటూ అభిమాన సంఘం నాయకులు తమ సంఘం లోని అభిమానులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాని వారు మాత్రం కింది స్థాయిలో గొడవలకు దిగుతూనే ఉన్నాయి.