Begin typing your search above and press return to search.

ఏంటి బ్ర‌ద‌ర్ అలా టీనేజర్ లా టీజ్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   31 Aug 2021 6:32 AM GMT
ఏంటి బ్ర‌ద‌ర్ అలా టీనేజర్ లా టీజ్ చేస్తున్నారు
X
వార‌సులు చూస్తుండ‌గానే ఎదిగేస్తున్నారు. అప్పుడు గౌత‌మ్ కృష్ణ నూనూగు మీసాల బాల‌కుడిగా ఎదిగేశాడు. అత‌డి వ‌య‌సు 15. టీనేజీ కుర్రాడిగా చాక్లెట్ బోయ్ లుక్ తో ఆక‌ర్షిస్తున్నాడు. అయితే పుత్రోత్సాహ‌ము ఆ సుపుత్రుని క‌నంగా..! అన్న చందంగా మ‌హేష్ లోని ఆనందానికి అవ‌ధులే లేవు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్న సంద‌ర్భంగా సూపర్ ఫ్యాన్స్ #HBD ప్రిన్స్ గౌత‌మ్ ట్యాగ్ ని వైర‌ల్ చేశారు. మ‌హేష్ కూడా తన కుమారుడితో ఉన్న ఓ ఫోటోని షేర్ చేసి.. శుభాకాంక్షలు తెలిపారు. త‌న‌యుడికి విషెస్ చెబుతూ హృదయపూర్వక సందేశాన్ని పోస్ట్ చేసారు. ``15 ఏళ్లు నా వార‌సుడికి.. మీరు ఎదగడం చూడటం నా గొప్ప ఆనందం. ఈ రోజు .. ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాను! ప్రపంచాన్ని జయించు.. లవ్ యు జిజి`` అని వ్యాఖ్య‌ను ఈ ఫోటోకి జోడించారు. ఈ ఫోటోలో గౌతమ్ తన తండ్రి భుజంపై చేయి వేసి న‌వ్వులు చిందిస్తూ నిలుచుకున్నాడు. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ తీసిన ఫోటో ఇది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూశాక అభిమానులు `ఏంటిది బ్ర‌ద‌ర్.. మ‌రీ అంత‌గా టీజ్ ఏస్తున్నారు? ` అని కామెంట్ చేస్తున్నారు. టీనేజీ కుమారుడి ప‌క్క‌నే ఉన్న మ‌హేష్ ని చూస్తుంటే అత‌డు అన్న‌య్యేనా? అన్నంత‌గా మేకోవ‌ర్ క‌నిపిస్తోంది. వ‌య‌సు 50కి చేరువ‌వుతున్నా ఆ ఛాయ‌లు మ‌హేష్ లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. గౌత‌మ్ కి అన్న‌య్య‌లానే ఉన్నారు! అంటూ అభిమానులు మురిసిపోతూ వేడెక్కించే కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. అంత‌గా మ‌హేష్ షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ టీజ్ చేస్తోంది మ‌రి. అన్న‌ట్టు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌ట‌వార‌సుడిగా అఖీరా నంద‌న్ హీరో అవుతున్నాడు. అలాగే గౌత‌మ్ కృష్ణ కూడా నూనూగు మీసాల వ‌య‌సులో నే ప్రేమ‌క‌థా చిత్రంతో తెరంగేట్రం చేస్తాడా? అత‌డు 1-నేనొక్క‌డినే త‌ర్వాత మ‌ళ్లీ పెద్ద తెర‌పై క‌నిపించ‌లేదు. మ‌రో సినిమా చేస్తాడ‌నే అభిమానులు వేచి చూస్తున్నారు. మ‌రి దీనికి మ‌హేష్ - న‌మ్ర‌త బృందం నుంచి ఆన్స‌ర్ రావాల్సి ఉంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో మళ్లీ బిజీ

ఇటీవ‌ల స‌ర్కార్ వారి పాట కు బ్రేక్ ఇచ్చి మ‌హేష్ కుటుంబంతో గోవా వెకేష‌న్ ని ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ - పైడిప‌ల్లి కుటుంబాలు క‌లిసి ఈ వెకేష‌న్ ని ఆస్వాధించి తిరిగి హైద‌రాబాద్ చేరుకున్నారు. వెకేష‌న్ ముగిసింది. స‌ర్కార్ వారి పాట పెండింగ్ ప‌నులు ముగించి త‌దుప‌రి త్రివిక్ర‌మ్ తో ప్రాజెక్ట్ కోసం రెడీ అవ్వాల్సి ఉంది. ఆ త‌ర్వాత రాజ‌మౌళితో సినిమా చేయనున్నారు. అటుపై పైడిప‌ల్లికి అవ‌కాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఏఎంబీ సినిమాస్ విస్త‌ర‌ణ ప్లాన్:

గ‌డిచిన రెండేళ్లుగా క‌రోనా క్రైసిస్ మ‌హ‌మ్మారీ అంతా మార్చేసింది. ముఖ్యంగా ఎగ్జిబిష‌న్ రంగానికి థియేట‌ర్ల రంగానికి ఇది ప్ర‌తిబంధ‌కంగా మారింది. అయినా న‌గ‌రాల్లో మ‌ల్టీప్లెక్స్ మాల్స్ బిజినెస్ కి ఢోఖా ఏం లేదు. జ‌నం య‌థావిధిగా మాల్స్ కి థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. అందుకే మ‌హేష్ - ఏషియ‌న్ సినిమాస్ జాయింట్ వెంచ‌ర్ అయిన ఏఎంబీ సినిమాస్ విస్త‌ర‌ణ‌కు ఎలాంటి అడ్డంకులు పున‌రాలోచ‌న‌లు లేవ‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏఎంబీ సినిమాస్ ని అటు బెంగ‌ళూరు స‌హా ఇటు తెలుగు రాష్ట్రాల్లో మెట్రోల్లో విస్త‌రించ‌నున్నారు.