Begin typing your search above and press return to search.

'అర్జున ఫల్గుణ' నుంచి అలరిస్తోన్న 'గోదారి వాళ్ళే' పాట..!

By:  Tupaki Desk   |   13 Nov 2021 2:50 PM GMT
అర్జున ఫల్గుణ నుంచి అలరిస్తోన్న గోదారి వాళ్ళే పాట..!
X
వర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు - అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా 'జోహార్' ఫేమ్ తేజ మర్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''అర్జున ఫల్గుణ''. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు అనూహ్య స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా 'గోదారి వాళ్ళే సందమామా' అనే పాట లిరికల్ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది.

'పచ్చాని ఊళ్లే సందమామా.. యాడసూడు వీళ్లే సందమామా..' అంటూ సాగిన ఈ మెలోడీ పాట శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. 'ఆసికాలు ఆడే అల్లరోళ్ళు.. భేషజాలు లేని బుజ్జిగాళ్ళు గోదారోళ్ళు' అంటూ గోదావరి జిల్లాల్లోని ప్రజల మనస్తత్వాలను తెలియజేసేలా లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ ఈ గీతానికి సాహిత్యం రాశారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఈ పాటను చిత్రీకరించారు.

ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ స్వరపరిచిన 'గోదారి వాళ్ళే సందమామా' పాటను అమల చేబోలు - అరవింద్ మురళి కలిసి ఆలపించారు. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అత్యున్నతంగా ఉంది. ఈ చిత్రానికి గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా.. విప్లవ్ నైషదం ఎడిటర్ గా వర్క్ చేశారు. ఫస్ట్ సింగిల్ గురించి హీరో శ్రీవిష్ణు ట్వీట్ చేస్తూ.. 'నేను గోదావరి జిల్లాల్లో పుట్టి పెరిగాను కాబట్టి, ఈ పాటలో భాగం కావడం వల్ల నా ఆనంద స్థాయి పారవశ్యానికి చేరుకుంది' అని పేర్కొన్నారు.

''అర్జున ఫల్గుణ'' చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీవిష్ణు పవర్ ఫుల్ రోల్‌ లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే దర్శకుడు తేజ మార్ని అందించగా.. సుధీర్ వర్మ డైలాగ్స్ సమకూర్చారు. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.