Begin typing your search above and press return to search.

చనిపోయాక కూడా ఆ 4 సెకన్లకు విలువ

By:  Tupaki Desk   |   11 May 2017 2:50 AM GMT
చనిపోయాక కూడా ఆ 4 సెకన్లకు విలువ
X
సినిమా కోసం విపరీతంగా కష్టపడి బాడీ పెంచేయడం.. షేపుల్లోకి తీసుకురావడం.. సిక్స్ ప్యాక్ చేయడం.. మెలికలు తిరిగిన దేహన్ని బిల్టప్ చేయడం వంటివి చూస్తూనే ఉన్నాం. హీరోలు మాత్రమే కాదు.. విలన్ పాత్రధారులు కూడా ఇందుకోసం బాగానే కష్టపడుతున్నారు. టాలీవుడ్ హీరో సుధీర్ బాబు.. బాలీవుడ్ లో బాఘీ మూవీ ద్వారా విలన్ గా పరిచయం అయ్యాడు. ఇందులో సిక్స్ ప్యాక్ కి మించిన బాడీతో కనిపించడం కోసం చాలానే కష్టపడ్డాడు ఈ హీరో కం విలన్.

ఇప్పుడు ఆ కష్టంపై రియాక్ట్ అయిన సుధీర్ బాబు చెప్పిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. 'కనీసం 4 నెలలు కష్టపడితే కానీ అలాంటి బాడీని బిల్డ్ చేయడం సాధ్యం కాదు. కానీ ఆ బాడీని స్క్రీన్ పై కేవలం 4 సెకన్లు మాత్రమే చూపిస్తారు. ఆ విషయం ముందే తెలిసినా అంతగా కష్టపడేందుకు కారణం ఉంది. రేపు నేను చనిపోయిన తర్వాత కూడా ఆ నాలుగు సెకన్లు అందరికీ కనిపిస్తుంది. అందుకే ఆ 4 సెకన్లకు అంత విలువ ఇవ్వాల్సి ఉంటుంది' అని చెప్పాడు సుధీర్ బాబు.

ఇప్పటికీ తన ఫిట్నెస్ ని యథాతథంగా కొనసాగిస్తున్న సుధీర్.. తాజాగా తను వర్కవుట్స్ చేస్తున్న విధానాన్ని.. మజిల్డ్ బాడీని ఫోటోల ద్వారా చూపించాడు. ప్రస్తుతం నారా రోహిత్.. సందీప్ కిషన్.. ఆదిలతో కలిసి శమంతకమణి అంటూ ఓ యంగ్ మల్టీ స్టారర్ మూవీలో నటిస్తున్నాడు సుధీర్ బాబు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.