Begin typing your search above and press return to search.

ఖరీదైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ ను అమ్మేసిన హీరోయిన్‌

By:  Tupaki Desk   |   4 Jan 2023 7:32 AM GMT
ఖరీదైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ ను అమ్మేసిన హీరోయిన్‌
X
బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్ కపూర్‌ 2015 సంవత్సరంలో ముంబైలోని సిగ్నేచర్ ఐలాండ్ లో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ ను దాదాపుగా రూ.18 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం జరిగిందట. ఆ అపార్ట్‌మెంట్ ను ఇప్పుడు సోనమ్‌ కపూర్‌ అమ్మేసింది అంటూ జాతీయ మీడియా సంస్థ ఒకటి తన కథనంలో పేర్కొంది.

ఆ అపార్ట్‌మెంట్‌ యొక్క అమ్మకం గురించి మరియు ఇతర విషయాల గురించి తన కథనంలో సదరు మీడియా సంస్థ పలు విషయాలను వెల్లడించింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సమీపరంలోని అపార్ట్‌మెంట్‌ లో ఉండే నాలుగు కార్ల పార్కింగ్ ప్లాట్ ను సోనమ్‌ కపూర్‌ రూ.32 కోట్లకు అమ్మేసిందట.

ఎస్‌ ఎమ్‌ ఎఫ్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వారు సోనమ్‌ కపూర్ యొక్క ప్లాట్‌ ను కొనుగోలు చేయడం జరిగిందట. ఈ కొనుగోలు ఒప్పందం కోసం దాదాపుగా రెండు కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీని సదరు సంస్థ చెల్లించినట్లుగా కూడా ఆ మీడియా సంస్థ కథనంలో రాసుకు వచ్చింది.

ఉన్నట్లుండి సోనమ్‌ కపూర్‌ అంత లగ్జరీ ప్లాట్‌ ను అమ్మాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఏడు సంవత్సరాల్లో ఆమె పెట్టిన మొత్తానికి దాదాపుగా డబుల్ రావడం వల్లే అమ్మేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే తల్లి అయిన సోనమ్‌ కపూర్‌ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.