Begin typing your search above and press return to search.

'జ‌వాన్' లో ఇల‌య ద‌ళ‌ప‌తి..అట్లీ ఇంట్రెస్ట్ తోనేనా?

By:  Tupaki Desk   |   14 July 2022 8:30 AM GMT
జ‌వాన్ లో ఇల‌య ద‌ళ‌ప‌తి..అట్లీ ఇంట్రెస్ట్ తోనేనా?
X
బాద్ షా షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో 'జవాన్' చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా అట్లీ మార్క్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన షారుక్ యాక్ష‌న్ పోస్ట‌ర్ తోనే 'జ‌వాన్' ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటారో? రివీల్ అయింది. ఒక్క పోస్ట‌ర్ తోనే సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసారు.

ఇక టీజ‌ర్..ట్రైల‌ర్ రిలీజ్ అయితే అంచ‌నాలు పీక్స్ కి చేర‌డం ఖాయం. తాజాగా సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒక‌టి వెలుగులోకి వ‌స్తోంది. టీజ‌ర్..ట్రైల‌ర్ కి మించి బ‌జ్ ని తీసుకొచ్చే ఇంట్రెస్టింగ్ న్యూస్ అది. 'జ‌వాన్' లో ఇల‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న‌ట్లు లీకులందుతున్నాయి. అట్లీ కోరిక మేర‌కు స‌హా షారుక్ స్వ‌యంగా కోర‌డంతో విజ‌య్ కాద‌న‌లేక పోయాడ‌ని స‌మాచారం.

పాత్ర ఎలా ఉంటుంద‌న్న‌ది? ఇంకా బ‌య‌ట‌కు రాలేదు గానీ విజ‌య్ ఎంట్రీతో సినిమా రేంజ్ అంత‌కంత‌కు పెరిగిపోవ‌డం ఖాయం. ఇదే నిజ‌మైతే సౌత్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే అట్లీ విజ‌య్ ని రంగంలోకి దించుతున్న‌ట్లు భావించాలేమో. ఇప్ప‌టికే సినిమాలో సౌత్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌ని ఎంపిక చేసుకున్నారు. తొలిసారి న‌య‌న్ షారుక్ తో రొమాన్స్ చేస్తుంది.

బాలీవుడ్ సినిమా అయినా 'జ‌వాన్' పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సౌత్ మార్కెట్ లో బిజినెస్ ప‌రంగా హైలో ఉండేలా సౌత్ స్టార్ల‌ని దించుతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో 'చెన్నై ఎక్స్ ప్రెస్' లో షారుక్ ర‌జ‌నీకాంత్ ఇమేజ్ ని తెలివిగా ఎన్ క్యాష్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీ మ్యాన రిజాన్ని షారుక్ ఇమిటేట్ చేసి పాన్ ఇండియా వైడ్ క‌లెక్ష‌న్లు కొల్గొట్టారు.

స‌రిగ్గా ఇప్పుడు 'జ‌వాన్' కోసం ఏకంగా విజ‌య్ కి ఓ చిన్న పాత్ర‌నే క్రియేట్ చేసి బ‌రిలోకి దించుతున్నారుట‌. ఇప్ప‌టికే విజ‌య్ టాలీవుడ్ లో కూడా లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమాతో విజ‌య్ తెలుగు అభిమానుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.

ఇలా అన్ని ర‌కాలుగా ఆలోచించుక‌నే అట్లీ తెలివైన నిర్ణ‌యాల‌తో సౌత్ స్టార్ల‌ని టార్గ‌ట్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. తెలుగు సినిమా పాన్ ఇండియా వైడ్ ఫేమ‌స్ అవ్వ‌డంతో బాలీవుడ్ స్టార్లు టాలీవుడ్ పై ఫోక‌స్ పెడుతోన్న సంగ‌తి తెలిసిందే.