Begin typing your search above and press return to search.

ఇంట్రెస్టింగ్‌ : అల్లు అర్జున్‌.. ఓ సర్కారు వారి పాట

By:  Tupaki Desk   |   23 Aug 2022 10:30 AM GMT
ఇంట్రెస్టింగ్‌ : అల్లు అర్జున్‌.. ఓ సర్కారు వారి పాట
X
అల్లు అర్జున్‌ సుకుమార్‌ ల కాంబోలో ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అంటూ ఎదురు చూసిన పుష్ప 2 సినిమా ఎట్టకేలకు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మొన్నటి వరకు బన్నీ పుష్ప 2 సినిమా గురించి మాత్రమే చర్చ జరిగింది. తాజాగా పుష్ప 2 సినిమా పట్టాలెక్కబోతున్నట్లుగా క్లారిటీ రావడంతో తదుపరి సినిమాల గురించిన చర్చ మొదలవుతుంది.

సర్కారు వారి పాట సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు పరశురామ్‌ తాజాగా అల్లు అర్జున్ ను కలిశాడని.. ఒక కథను చెప్పాడని సమాచారం అందుతోంది. గీత గోవిందం సినిమా విడుదల అయిన వెంటనే గీతా ఆర్ట్స్ లో మరో సినిమాను చేసేందుకు పరశురామ్‌ సైన్ చేశాడు. అడ్వాన్స్ ను కూడా తీసుకున్న పరశురామ్‌ తాజాగా బన్నీ కోసం కథ చెప్పాడట.

మెడికల్‌ మాఫియా నేపథ్యంలో దర్శకుడు పరశురామ్‌ రెడీ చేసిన కథ లైన్‌ బన్నీకి బాగా నచ్చిందట. అల్లు అరవింద్ కూడా ఆ లైన్ కి ఓకే చెప్పాడట. ఆ లైన్ ను డెవలప్‌ చేసి బన్నీ ఇమేజ్ కి తగ్గట్లుగా.. కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ మాదిరిగా రెడీ చేసుకు రావాలంటూ గీతా ఆర్ట్స్ వారు పరశురామ్ కు సూచించినట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం చేస్తున్న పుష్ప 2 తో పాటు అల్లు అర్జున్ కి ఇతర కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. కనుక పరశురామ్‌ కి డేట్లు ఇవ్వాలంటే కనీసం రెండేళ్ల సమయం అయినా పడుతుంది. అప్పటి వరకు నాగ చైతన్య తో పరశురామ్‌ సినిమా ను పూర్తి చేసి మరేదైనా సినిమాను కూడా మొదలు పెట్టి ముగించే అవకాశాలు ఉన్నాయి. అల్లు అర్జున్.. పరశురామ్‌ కాంబో సినిమా మాత్రం దాదాపుగా కన్ఫర్మ్‌ అయినట్లే అంటూ మెగా కాంపౌండ్ నుండి టాక్ వినిపిస్తోంది.

అల్లు అర్జున్ పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్టార్‌ గా మారాడు. పుష్ప 2 తో ఆ స్థాయి మరింత పెరగడం ఖాయం. అందుకే ఇక నుండి ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా సినిమా అన్నట్లుగానే ఉంటుందని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అందుకే పరశురామ్‌ మెడికల్‌ మాఫియా స్క్రిప్ట్‌ పాన్‌ ఇండియా అప్పీల్ ఉండేలా రెడీ చేయాల్సిందిగా కూడా సూచించారట. అందుకు తగ్గట్లుగా పరశురామ్‌ స్క్రిప్ట్‌ రెడీ చేస్తాడా అనేది చూడాలి.