Begin typing your search above and press return to search.

దిల్ రాజుని బాల‌య్య ఆ రోజు ఆడేసుకున్నారా?

By:  Tupaki Desk   |   10 Dec 2022 6:49 AM GMT
దిల్ రాజుని బాల‌య్య ఆ రోజు ఆడేసుకున్నారా?
X
సీనియ‌ర్ హీరోల్లో నంద‌మూరి బాల‌కృష్ణ ఎంత సీరియ‌స్ గా వుంటారో అంత‌గా సెన్సాఫ్ హ్యూమ‌ర్ తో వ్య‌వ‌హ‌రిస్తుంటారు. కోపంగా వున్న టైమ్ లో ప‌క్క‌న ఎవ‌రు చిరాకు తెప్పించిన ద‌బిడి దిబిడే అంటూ వీపే విమానం మోత‌మోగించే బాల‌య్య కూల్ గా వున్న‌ప్పుడు మాత్రం త‌న‌దైన మార్కు సెన్సాఫ్ హ్యూమ‌ర్ తో అద‌ర‌గొడుతూ న‌వ్వులు పూయిస్తుంటారు. ప్ర‌త్య‌ర్థుల‌పై చ‌తుర్లతో కౌంట‌ర్లతో మంటెక్కిస్తూ పూస్తూనే న‌వ్విస్తూ వుంటారు. రీసెంట్ ఆహా కోసం అన్ స్టాప‌బుల్ షో ని లీడ్ చేయ‌డం మొద‌ల‌య్యాక బాల‌య్య‌లో హ్యూమ‌ర్ ఉర‌క‌లేస్తోంది.

సెట్ లో సీనియ‌స్ గా వుండే బాల‌య్య అన్ స్టాప‌బుల్ త‌రువాత నుంచి చతుర్లు ఆడ‌టం మొద‌లు పెట్టారు. ఎవ‌రు తన కంటికి క‌నిపిస్తే వారిపై స‌ర‌దాగా పంచ్ లు వేస్తూనే మండేలా కౌంట‌ర్లేస్తున్నారు. ఆ మ‌ధ్య మ‌హేష్ బాబు పై కూడా కౌంట‌ర్లు వేసిన విష‌యం తెలిసిందే. సెట్ లో కౌంట‌ర్లు బాగా పేలుస్తావంట క‌దా? అంటూ ఓ ఆట ఆడుకున్నారు. దీంతో మ‌హేష్ బాబు కు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌న్నీఆ షో కార‌ణంగా బ‌య‌ట‌పెట్టాడు బాల‌య్య‌.

ఇదే త‌ర‌హాలో బాలకృష్ణ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజుని ఓ ఆట ఆడుకున్నార‌ట‌. త‌నదైన పంచ్ ల‌తో న‌వ్విస్తూనే కారం పూసినంత ప‌ని చేశార‌ట‌. రీసెంట్ గా అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ లో బాల‌కృష్ణ న‌టిస్తున్న 108 వ ప్రాజెక్ట్ లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భంగా మైత్రీ వారితో పాటు మిగ‌తా నిర్మాత‌లు కూడా హాజ‌ర‌య్యారు. వీరితో పాటే దిల్ రాజు కూడా హాజ‌ర‌య్యాడు. ఇక్క‌డే బాల‌య్య‌కు దిల్ రాజుకు మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన సంవాదం జ‌రిగింద‌ట‌.

సందు దొరికితే బాల‌య్య ఊరుకుంటాడా..? ఇంకే ముందీ త‌న చ‌తుర్ల‌తో దిల్ రాజుపై పంచ్ ల వ‌ర్షం కురిపించాడ‌ట‌. పిచ్చా పాటి మాట‌లు అయ్యాక బాల‌య్య త‌న పంచ్ ల ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశార‌ట‌. 'నిన్ను దిల్ రాజు అని ఎందుకు అంటారు.. నువ్వు రాజు కాదు కాదా' అన్నార‌ట‌. దీనికి దిల్ రాజు.. త‌న‌ని అంతా రాజు అని పిలిచే వార‌ని, దిల్ సినిమా త‌రువాత దిల్ రాజు అని పిల‌వ‌డం మొద‌లు పెట్టార‌ని చెప్పార‌ట‌.

ఆ స‌మాధానం బాల‌య్య‌కు స‌రిపోలేద‌ట‌. వెంట‌నే 'నీకు దిల్ కూడా లేదుగా'అని మ‌రో కౌంట‌ర్ వేశాడ‌ట‌.ఆ మాట‌లు విన్న అక్క‌డున్న వారంతా ఘొళ్లున న‌వ్వేశార‌ట‌.

కార‌ణం ఏంటంటే ఈ సంక్రాంతికి దిల్ రాజు బాల‌య్య‌, చిరంజీవిల‌కు పోటీగా విజ‌య్ ని 'వార‌సుడు'తో దించేస్తుండ‌టం, దీని కోసం భారీ స్థాయిలో థియేట‌ర్ల‌ని బ్లాక్ చేశాడ‌ని వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలోబాల‌య్య .. దిల్ రాజుకు కౌంట‌ర్ ఇవ్వ‌డంతో ఆ విష‌యం తెలిసి అంతా న‌వ్వుకున్నార‌ని చెబుతున్నారు. దిల్ రాజుతో బాల‌య్య దాదాపు 15 నిమిషాల పాటు ఓ ఆట ఆడుకున్న‌ట్టుగా ఇన్ సైడ్ టాక్‌.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.