Begin typing your search above and press return to search.

ముంబై నుంచి బాలీవుడ్ తరలిపోబోతుందా!

By:  Tupaki Desk   |   29 Oct 2021 11:30 AM GMT
ముంబై నుంచి బాలీవుడ్ తరలిపోబోతుందా!
X
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ బాద్షా, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ ఆధికారిగా ఉన్న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచనల ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం అలా కొనసాగుతుండగానే నవాబ్ మాలిక్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘాటైన వ్యాఖ్యాలు చేశారు. బాలీవుడ్‌ ను ముంబై నుంచి తరలించడానికి బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా నోయిడాలో ఫిల్మ్ సిటీ ఏర్పాటుపై ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సినీ ప్రముఖులతో సమావేశమైన విషయాన్ని మాలిక్ ప్రస్తావించారు. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు.. బాలీవుడ్‌ను మహారాష్ట్ర నుండి తరలించడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇది బాలీవుడ్ పరువు తీసేందుకు బీజేపీ చేసిన కుట్ర’ అని నవాబ్ మాలిక్ మీడియా సమావేశంలో అన్నారు. భయం కారణంగానే అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించాడని చెప్పారు. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆర్యన్‌ ఖాన్‌ ను ఎన్‌ సీబీ కార్యాలయానికి ఈడ్చుకెళ్లిన వ్యక్తి ఇప్పుడు జైలులో ఉన్నాడు. ఆర్యన్ ఖాన్‌ తో పాటుగా ఇతరులకు బెయిల్ రాకుండా చూస్తున్న వ్యక్తి నిన్న కోర్టు తలుపులు తట్టాడు.

రక్షణ కల్పించాలని కోరుతూ గత వారం ముంబై పోలీసులను ఆశ్రయించాడు. ఇప్పుడు ముంబై పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. అతను నిజంగా ఏదో తప్పు చేసి ఉంటాడు అందుకే అతనిపై చర్యలు తీసుకుంటారమోనని భయపడుతున్నాడు’ అని నవాబ్ మాలిక్ చెప్పుకొచ్చాడు. ఇది వ్యక్తిగత పోరాటం కాదని నవాబ్ మాలిక్ అన్నారు. తాను చేసిన ఆరోపణలు అన్నింటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయని వెల్లడించారు. సమీర్ వాంఖడే తన గొంతును అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు. ఇదిలా ఉంటే సమీర్ వాంఖడే‌కు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయబోమని ముంబై పోలీసులు హైకోర్ట్‌కు తెలిపారు. గత కొద్ది రోజులుగా వాంఖడే అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని, ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి నకిలీ పత్రాలు సృష్టించారని నవాబ్ మాలిక్ ఆరోపణలు చేశారు.