Begin typing your search above and press return to search.

మ‌హేష్ డైరెక్ట‌ర్ ఆ విష‌యంలో వెన‌క‌బ‌డే వున్నారా?

By:  Tupaki Desk   |   27 April 2022 4:30 PM GMT
మ‌హేష్ డైరెక్ట‌ర్ ఆ విష‌యంలో వెన‌క‌బ‌డే వున్నారా?
X
ఒక స్టార్ తో సినిమా అంటే ప్ర‌స్తుతం ద‌ర్శ‌కులు అన్నీ తామై న‌డిపిస్తున్నారు. కెమెరా వెన‌కుండి యాక్ష‌న్ క‌ట్ అని చెప్ప‌డ‌మే కాకుండా సినిమాని త‌మ‌దైన స్టైల్లో ప్ర‌మోట్ చేస్తూ సినిమాకు హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. హీరోల‌ని కూడా ప్ర‌మోష‌న్స్ లో చురుగ్గా పాల్గొనేలా ప్లాన్ చేస్తూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. ఈ విషయంలో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ముందు వ‌రుస‌లో నిలుస్తున్నారు. బాహుబ‌లి, బాహుబ‌లి 2, ట్రిపుల్ ఆర్ ప్ర‌మోష‌న్ విష‌యంలో నిర్మాత‌ల క‌న్నా ప్ర‌చార బాధ్య‌త‌ల్ని భుజాన మోశారు జ‌క్క‌న్న‌.

త‌నదైన స్ట్రాట‌జీతో బాహుబ‌లి, బాహుబ‌లి 2, ట్రిపుల్ ఆర్ సినిమాల‌కు స‌రికొత్త పంథాలో ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ని ప్లాన్ చేసి ఒక భారీ సినిమాకు ఏ స్థాయిలో ప‌బ్లిసిటీ చేయ‌వ‌చ్చో నిరూపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. రాజ‌మౌళి సెట్ చేసిన ఈ ఫార్ములాని ఇప్ప‌డు ప్ర‌తీ ద‌ర్శ‌కుడు ఫాలో అవ్వాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు కానీ ఓ ద‌ర్శ‌కుడు మాత్రం ఇప్ప‌టికీ ఫ్యాన్స్ నే ప్ర‌స‌న్నం చేసుకోలేక‌పోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంద‌ని ఇండ‌స్ట్రీలో ఓ వ‌ర్గం చెప్పుకుంటోంది.

వివ‌రాల్లోకి వెళితే.. యంగ్ డైరెక్ట‌ర్ ప‌రశురామ్ 'గీతా గోవిందం' వంటి బ్లాక్ బస్ట‌ర్ మూవీ త‌రువాత చేస్తున్న చిత్రం 'స‌ర్కారు వారి పాట‌'. మ‌హేష్ తో సినిమా డ్రీమ్ అంటూ అన‌తి కాలంలోనే త‌న డ్రీమ్ ని నిజం చేసుకుంటున్న ప‌ర‌శురామ్ ఒక్క విష‌యంలో మాత్రం వెన‌క‌బ‌డి వుండ‌టం ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో ప‌ర‌శురామ్ డైరెక్ట్ చేస్తున్న 'స‌ర్కారు వారి పాట‌' మే 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. రిలీజ్ టైమ్ మ‌రో రెండు వారాలు వున్న నేప‌థ్యంలో ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ని మేక‌ర్స్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తున్నారు.

తొలి సారి సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ తో సినిమా చేస్తున్న ప‌ర‌శురామ్ ఇప్ప‌టికైనా త‌న పోస్ట్ ల‌తో సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ అవ్వాలని, అలా అయితే ఫ్యాన్స్ అత‌నికి ద‌గ్గ‌ర‌య్యే అవ‌కాశాలు వున్నాయ‌ని చెబుతున్నారు. ఇదిలా వుంటే త్వ‌ర‌లోనే 'స‌ర్కారు వారి పాట‌' ట్రైల‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ట్రైల‌ర్ రిలీజ్ త‌రువాత అయినా స‌మీక‌ర‌ణాలు మారి అభిమానుల‌కు ప‌ర‌శురామ్ త‌గ్గ‌ర‌వుతార‌ని చెబుతున్నారు. ట్రైల‌ర్ ఆక‌ట్టుకోగ‌లిగితే ఫ్యాన్స్ ప‌ర‌శురామ్ ని ఓన్ చేసుకోవ‌డం ఖాయం అని, దీంతో సినిమాకు మ‌రింత బూస్ట్ ల‌భిస్తుంద‌ని అంటున్నారు.

బ్యాకింగ్ రంగాన్ని వైట్ కాల‌ర్ నేర‌గాళ్లు ఎలా మోసం చేస్తున్నారో తెలియ‌జేస్తూ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకుని ఫ్యాన్స్ ని మెప్పించి ప‌ర‌శురామ్ స్టార్ డైరెక్ట‌ర్ ల జాబితాలో చేర‌తారా?.. వెంట‌నే మ‌రో క్రేజీ స్టార్ ప్రాజెక్ట్ ని సొంతం చేసుకుంటారా? అన్న‌ది తెలియాలంటే వేచి చూడాల్సిందే.