Begin typing your search above and press return to search.
చరణ్..యశ్ కాంబోపై కాక పుట్టిస్తోన్న KVN
By: Tupaki Desk | 25 Oct 2022 5:56 AM GMT`కేజీఎఫ్` ప్రాంచైజీ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించింది లేదు. పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన గుర్తింపు తో తదుపరి ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలి? అన్న దానిపై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్నాడు. ఈ నేపథ్యంలో కథని ఎంపిక చేసుకోవడంలో..డైరెక్టర్ ని లాక్ చేసే విషయంలో లోతుగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏ ర్పడింది.
యశ్ ఇప్పుడు ఏ సినిమా చేసినా దాన్ని పాన్ ఇండియాలో మార్కెట్ చేయాలి. వందల కోట్లు వసూళ్లు తెచ్చే కంటెంట్ అయి ఉండాలి. అలాంటి కథ కుదిరే వరకూ యశ్ కొత్త సినిమా విషయంలో జాప్యం తప్పనిసరే. సరిగ్గా ఇదే పరిస్థితిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కనిపిస్నతోన్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
అటుపై రామ్ చరణ్ కి కుదిరినంత ఈజీగా తారక్ విషయం జరగలేదు. కొరటాల తో సినిమా ఉన్నా? కథ విషయంలో జరుగుతోన్న జాప్యం చూస్తూనే ఉన్నాం. ఇలా ఇక్కడిలా తారక్..అక్కడలా యశ్ పాన్ ఇండియా ఇమేజ్ నడుమ కొంత ఒత్తిడికైతే గురవుతున్నారు. తాజాగా నిన్నటి రోజున దీపావళి సందర్భంగా KVN ప్రొడక్షన్స్ అనే కన్నడ నిర్మాణ సంస్థ `మఫ్టీ` దర్శకుడు నర్తన్ తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రొడక్షన్ హౌస్ దీనికి సంబంధించి టీజర్ పోస్టర్ను కూడా విడుదల చేసింది. అయితే ఇందులో హీరో ఎవరు? తదితర వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. దీంతో సదరు బ్యానర్ సినిమాపై ఆసక్తి నెలకొంది. అందుకు ఓ ప్రత్యేక కారణం కూడా కనిపిస్తుంది. ఇదే దర్శకుడు యష్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో పాన్-ఇండియా మల్టీ-స్టారర్ చేయాలనుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అయింది.
ఈ ఆకస్మిక ప్రకటన చాలా మందిని షాక్ కి గురి చేస్తోంది. కెవీపీ ప్రకటన నేపథ్యంలో యశ్-చరణ్ ప్రాజెక్ట్ ఇదే అయి ఉంటుందని గెసెస్ తెరపైకి వస్తున్నాయి. ఆస్టార్ హీరోలిద్దరితో సినిమా చేసే ప్లాన్ తోనే ఇంత భారీ ఎత్తున అనౌన్స్ మెంట్ ఇచ్చారని.. అతి త్వరలోనే యశ్-చరణ్ పేర్లను అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు ఊపందుకుంటున్నాయి. అయితే ఇంత వరకూ ఈ విషయంపై యశ్ గానీ...చరణ్ గానీ స్పందించలేదు. యశ్ బెంగుళూరులోనే ఉన్నా...చరణ్ మాత్రం ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ లో భాగంగా జపాన్ టూర్ లో ఉన్నారు.
యశ్ ఇప్పుడు ఏ సినిమా చేసినా దాన్ని పాన్ ఇండియాలో మార్కెట్ చేయాలి. వందల కోట్లు వసూళ్లు తెచ్చే కంటెంట్ అయి ఉండాలి. అలాంటి కథ కుదిరే వరకూ యశ్ కొత్త సినిమా విషయంలో జాప్యం తప్పనిసరే. సరిగ్గా ఇదే పరిస్థితిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కనిపిస్నతోన్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
అటుపై రామ్ చరణ్ కి కుదిరినంత ఈజీగా తారక్ విషయం జరగలేదు. కొరటాల తో సినిమా ఉన్నా? కథ విషయంలో జరుగుతోన్న జాప్యం చూస్తూనే ఉన్నాం. ఇలా ఇక్కడిలా తారక్..అక్కడలా యశ్ పాన్ ఇండియా ఇమేజ్ నడుమ కొంత ఒత్తిడికైతే గురవుతున్నారు. తాజాగా నిన్నటి రోజున దీపావళి సందర్భంగా KVN ప్రొడక్షన్స్ అనే కన్నడ నిర్మాణ సంస్థ `మఫ్టీ` దర్శకుడు నర్తన్ తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రొడక్షన్ హౌస్ దీనికి సంబంధించి టీజర్ పోస్టర్ను కూడా విడుదల చేసింది. అయితే ఇందులో హీరో ఎవరు? తదితర వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. దీంతో సదరు బ్యానర్ సినిమాపై ఆసక్తి నెలకొంది. అందుకు ఓ ప్రత్యేక కారణం కూడా కనిపిస్తుంది. ఇదే దర్శకుడు యష్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో పాన్-ఇండియా మల్టీ-స్టారర్ చేయాలనుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అయింది.
ఈ ఆకస్మిక ప్రకటన చాలా మందిని షాక్ కి గురి చేస్తోంది. కెవీపీ ప్రకటన నేపథ్యంలో యశ్-చరణ్ ప్రాజెక్ట్ ఇదే అయి ఉంటుందని గెసెస్ తెరపైకి వస్తున్నాయి. ఆస్టార్ హీరోలిద్దరితో సినిమా చేసే ప్లాన్ తోనే ఇంత భారీ ఎత్తున అనౌన్స్ మెంట్ ఇచ్చారని.. అతి త్వరలోనే యశ్-చరణ్ పేర్లను అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు ఊపందుకుంటున్నాయి. అయితే ఇంత వరకూ ఈ విషయంపై యశ్ గానీ...చరణ్ గానీ స్పందించలేదు. యశ్ బెంగుళూరులోనే ఉన్నా...చరణ్ మాత్రం ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ లో భాగంగా జపాన్ టూర్ లో ఉన్నారు.