Begin typing your search above and press return to search.
RRR కి నాలుగేళ్లు..ఇంకా 50 రోజుల్లోనే!
By: Tupaki Desk | 18 Nov 2021 4:30 PM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలోపాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. వరల్డ్ వైడ్ గా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్న కొవిడ్ సహా షూటింగ్ బిలే కారణంగా పనులన్ని వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు కరోనా కూడా తగ్గింది. పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచైనా అంతా మంచి జరగాలని దేవుళ్లను ప్రార్ధిస్తున్న సమయం ఇది.
కొటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించడానికి ఇంకెంతో సమయం లేదు. ఇక ఏడాది ఆరంభంలోనే సినీ ప్రియులకు ఆర్ ఆర్ ఆర్ రూపంలో బిగ్ ట్రీట్ అందబోతుంది. అయితే ఈ సినిమా ప్రారంభమై సరిగ్గా నేటికి 18-11-2021కి నాలుగేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. 2017 లో `ఆర్ ఆర్ ఆర్` ప్రారంభానికి ముందు ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని చరణ్..ఎన్టీఆర్..రాజమౌళి కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి జక్కన్న విషయాన్ని ప్రకటించారు.
ఇప్పుడు ఇదే ఫోటోని ట్యాగ్ చేసి నాలుగేళ్లు క్రితం ఈ ఫోటోని షేర్ చేసి అభిమానుల్లో అంచనాల్ని రేకెత్తించాం. మరో 50 రోజుల్లోనే చిత్రాన్ని ప్రేక్షకాభిమానుల్లోకి తీసుకొస్తున్నాం. ఊహించని చిత్రం విచిత్రం..స్నేహానికి చాచిన హస్తం. జనవరి 7న కలుద్దాం. లెట్స్ బ్లాస్ట్ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ మెగా- తారక్ అభిమానుల్లో ఉత్నాహాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. సినిమా చూడాలని అన్న ఎగ్టైట్ మెంట్ ని పెంచుతోంది. ఈ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ తో డి.వి.వి ఎంటర్ టైన్ మెంట్స్ పై దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
కొటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించడానికి ఇంకెంతో సమయం లేదు. ఇక ఏడాది ఆరంభంలోనే సినీ ప్రియులకు ఆర్ ఆర్ ఆర్ రూపంలో బిగ్ ట్రీట్ అందబోతుంది. అయితే ఈ సినిమా ప్రారంభమై సరిగ్గా నేటికి 18-11-2021కి నాలుగేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. 2017 లో `ఆర్ ఆర్ ఆర్` ప్రారంభానికి ముందు ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని చరణ్..ఎన్టీఆర్..రాజమౌళి కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి జక్కన్న విషయాన్ని ప్రకటించారు.
ఇప్పుడు ఇదే ఫోటోని ట్యాగ్ చేసి నాలుగేళ్లు క్రితం ఈ ఫోటోని షేర్ చేసి అభిమానుల్లో అంచనాల్ని రేకెత్తించాం. మరో 50 రోజుల్లోనే చిత్రాన్ని ప్రేక్షకాభిమానుల్లోకి తీసుకొస్తున్నాం. ఊహించని చిత్రం విచిత్రం..స్నేహానికి చాచిన హస్తం. జనవరి 7న కలుద్దాం. లెట్స్ బ్లాస్ట్ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ మెగా- తారక్ అభిమానుల్లో ఉత్నాహాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. సినిమా చూడాలని అన్న ఎగ్టైట్ మెంట్ ని పెంచుతోంది. ఈ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ తో డి.వి.వి ఎంటర్ టైన్ మెంట్స్ పై దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.