Begin typing your search above and press return to search.

నీకు ఏ బహుమానం ఇచ్చినా సరిపోదు : చరణ్‌

By:  Tupaki Desk   |   20 July 2021 7:30 AM GMT
నీకు ఏ బహుమానం ఇచ్చినా సరిపోదు : చరణ్‌
X
టాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్ లో రామ్‌ చరణ్‌ మరియు ఉపాసనలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటారు. వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరు కూడా వారి వారి వృత్తి మరియు పనులతో బిజీగా ఉన్నా కలిసి హాలీడేస్ కు వెళ్లడం.. వైవాహిక జీవితాన్ని ఆస్వాదించడం చేస్తూనే ఉంటారు. ప్రతి సందర్బంలో కూడా వీరిద్దరు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంటూ అభిమానులకు మరింత చేరువ అవుతూ ఉంటారు. మెగా ఇంటి కోడలు ఉపాసన ఎన్నో ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉపాసన నిర్వహించే కార్యక్రమాలతో ఎప్పుడూ మీడియాలో నిలుస్తూ ఉంటారు. ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచే ఉపాస భార్యగా దక్కడం చరణ్‌ లక్‌ గా చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తు ఉంటారు.

ఇక వీరిద్దరు ఒకరి బర్త్‌ డేకు ఒకరు ప్రత్యేకంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ప్రత్యేక బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. ప్రతి బర్త్‌ డే కు ప్రత్యేకంగా వీరు ప్లాన్‌ చేసుకుంటూ ఉంటారు. నేడు ఉపాసన పుట్టిన రోజు సందర్బంగా చరణ్‌ సోషల్‌ మీడియాలో ఆమెపై తనకు ఉన్న ప్రేమను కనబర్చాడు. నీ అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి నీవు తోడుగా నిలుస్తావు.. నీ కుటుంబంలో ఎవరికి సాయం కావాలన్నా కూడా వారికి మద్దతుగా నిలుస్తావు. నీకు ఏ బహుమానం ఇచ్చినా కూడా సరిపోదు అంటూ ఉపాసనకు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ చరణ్‌ ఈ ఫొటోను షేర్‌ చేశాడు.

చరణ్‌ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆయన షేర్‌ చేసిన ఈ ఫొటో ను మెగా అభిమానులతో పాటు ఎంతో మంది నెట్టింట తెగ షేర్స్‌ చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ ఉపాసన కోసం ఏం ప్రత్యేక బహుమానం ఇచ్చాడు అంటూ చాలా మంది నెట్టింట తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చరణ్‌ మాత్రం తన ట్వీట్‌ తో ఉపాసన పై తనకు ఉన్న ప్రేమను చూపించేశాడు. ఎంతటి బహుమానం ఇచ్చినా కూడా నీకు సరిపోదు అంటూ ఆమె యొక్క గొప్పతనంను చరణ్‌ చెప్పి ఆమె స్థాయిని మరింతగా పెంచాడు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం చరణ్‌ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ చివరి షెడ్యూల్‌ కు రెడీ అవుతున్నాడు. ఇటీవలే ఆచార్య సినిమా షూటింగ్ ను కూడా చరణ్‌ ముగించాడు. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాదిలో విడుదల కాబోతున్నాయి. ఇక ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాత దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్‌ నటించబోతున్నాడు. దిల్‌ రాజు నిర్మించబోతున్న ఆ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా సౌత్‌ ఇండియన్‌ సినీ అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా కు సాయి మాధవ్ బుర్రా మాటలు అందించనున్నాడు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జోరుగా సాగుతోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉందని మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.