Begin typing your search above and press return to search.

జయప్రకాష్ రెడ్డి మరణానికి ముందు ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   9 Sept 2020 10:30 PM IST
జయప్రకాష్ రెడ్డి మరణానికి ముందు ఏం జరిగింది?
X
రాయలసీమ యాస, భాషతో టాలీవుడ్ లో తనకంటూ ముద్ర వేసుకున్న కమెడియన్ జయప్రకాష్ రెడ్డి ఇటీవల అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది. జయప్రకాష్ రెడ్డి అనారోగ్యం బారిన కూడా పడ్డట్టు వార్తలు రాలేదు. సడన్ గా ఎలా చనిపోయాడన్నది ఎవరికీ అంతుపట్టలేదు. ఆయన చనిపోవడానికి ముందు అసలేం జరిగిందనేది తాజాగా ఆయన భార్య రాధ మీడియాకు వెల్లడించారు.

జయప్రకాష్ రెడ్డి ఉదయం బాత్రూంలో గుండెపోటుతో మరణించారు. ఆరోజు ఆయన ఉదయం 3.30 గంటలకే నిద్రలేచారని ఆయన భార్య రాధ మీడియాకు తెలిపారు.ఆయన అసౌకర్యంగా ఉందని.. నొప్పి వస్తుందని ఏమీ తెలుపలేదు. లేచిన కాసేపటికే పిల్లలతో మాట్లాడాలని అన్నారని.. ఉదయం 6 గంటలకు మాట్లాడుదామని తాను చెప్పానని భార్య వివరించారు.

తర్వాత బాత్రూంకు వెళ్లిన జయప్రకాష్ రెడ్డి అక్కడే కళ్లు తేలేసి కనిపించారని ఆయన భార్య తెలిపింది.. వెంటనే డాక్టర్ ను పిలిపించి పల్స్ చూడగా.. ఆయన చనిపోయాడని తెలిపారు. ఇదంతా ఐదు నిమిషాల్లోనే జరిగిపోయిందని ఆయన భార్య అసలు ఏం జరిగిందనేది వివరించింది.

కాగా వారం నుంచి ఆయన కాస్త అనారోగ్యంగా ఉన్నట్టు భార్య తెలిపింది. షుగర్ కూడా డౌన్ అయ్యిందని.. కొంచెం నీరసంగా కనిపించారని తెలిపారు. అంతకుముందు గతంలోనే ఆయన గుండెకు వైద్యులు స్టంట్ వేశారని వివరించారు.