Begin typing your search above and press return to search.

ఆమెను చూసి కళ్లు తిప్పుకోలేకపోయారట

By:  Tupaki Desk   |   4 Oct 2016 11:00 PM IST
ఆమెను చూసి కళ్లు తిప్పుకోలేకపోయారట
X
అతిలోక సుందరిగా అందరి చేత అనిపించుకునే ఏకైన నటి శ్రీదేవి అని మాత్రమే చెప్పుకోవాలి. వయసు మీద పడినా.. ఆమెను మాత్రం అతిలోక సుందరిగానే చూస్తున్నారు. ఇక.. ఆమె కుమార్తె జాహ్నవి సినిమాల్లో ఎంట్రీ ఇస్తారన్నది పాత వార్తే. ఇప్పటికే పలువురి హీరో పేర్లతో జత కట్టి ఆమె ఎంట్రీ ఉంటుందన్నవార్తలు చాలా విన్నాం. ఇప్పుడు కాకున్నా.. మరో నాలుగైదు నెలల తర్వాత అయినా ఆమె ఎంట్రీ పక్కా అన్నది తెలిసిందే.

అయితే.. దీనికి సంబంధించిన ఒక సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత.. దర్శకుడు కరణ్ జోహార్ తీసే సినిమాలో ఆమె ఎంట్రీ ఇస్తారని.. ఇందుకు శ్రీదేవి.. బోనీ కపుర్లు ఓకే చేసినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా జాహ్నవి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించిన ఘటన ఒకటి చోటు చేసుకుంది.

గతంలో ఎప్పుడూ కనిపించనంత గ్లామర్ తో అమ్మడి దర్శనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. అతిలోకసుందరి కూతురన్న రేంజ్లో జాహ్నవి ఉందన్న వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి. ఆదివారం జరిగిన మీర్జ్యా ప్రీమియర్ షోకు వచ్చిన జాహ్నవిని చూసిన వారంతా కళ్లు తిప్పుకోలేకపోయారట. ఎక్కడ ఏమేం ఉండాలో అవన్ని ఉండటమే కాదు.. ఎక్కడ ఎంత చూపించాలన్న విషయం మీద ప్రత్యేక శ్రద్ధతో రెఢీ అయి వచ్చినట్లుగా పలువురి నోట వినిపించటం గమనార్హం. నటన విషయాన్నిపక్కన పెడితే.. అందరి దృష్టిని ఆకర్షించే అందం విషయంలో మాత్రం జాహ్నవి ఏ మాత్రం తగ్గటం లేదన్న విషయాన్ని తాజా పోగ్రామ్ లో కనిపించిన జాహ్నవిని చూస్తే అర్థమైందని చెబుతున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/