Begin typing your search above and press return to search.

మరో ఐటమ్ సాంగ్ కు ఓకే చెప్పిన జిగేల్ రాణి..?

By:  Tupaki Desk   |   11 April 2022 1:30 PM GMT
మరో ఐటమ్ సాంగ్ కు ఓకే చెప్పిన జిగేల్ రాణి..?
X
బుట్టబొమ్మ పూజ హెగ్డే ప్రస్తుతం ఫుల్ ఫార్మ్ లో ఉంది. ఒకప్పుడు ఐరెన్ లెగ్ అనిపించుకున్న ఈ భామ.. ఇప్పుడు వరుస విజయాలు అందుకుంటూ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. క్రేజీ ఆఫర్స్ తో ప్రస్తుతం దక్షిణాది అగ్ర కథానాయికలలో ఒకరిగా వెలుగొందుతోంది.

స్టార్ హీరోల ఫస్ట్ ఛాయిస్ అయిన పూజా.. తెలుగు తమిళంతో పాటుగా హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఒవైపు హీరోయిన్ గా రాణిస్తున్న.. అవకాశం వచ్చినప్పుడు స్పెషల్ రోల్స్ - ఐటమ్ సాంగ్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు.

చిరంజీవి - రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో పూజా ప్రత్యేక పాత్రలో నటించింది. చెర్రీ కి జోడీగా నీలాంబరిగా సందడి చేయనుంది. ఇక 'రంగస్థలం' చిత్రంలో చరణ్ సరసన 'జిగేల్ రాణి' పాటకు ఆడిపాడింది. ఈ క్రమంలో పూజా హెగ్డే 'ఎఫ్ 3' చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అయిందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎఫ్ 3' సినిమాలో వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. తమన్నా భాటియా - మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సోనాలి చౌహన్ స్పెషల్ రోల్ ప్లే చేస్తోంది.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 27న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థలో పూజా హెగ్డే ఇంతకుముందు పలు చిత్రాల్లో నటించింది. నిర్మాతతో ఉన్న సాన్నిహిత్యంతో 'F 3' లో ప్రత్యేక గీతం చేయడానికి అంగీకరించిందట.

కాకపోతే దీని కోసం స్టార్ హీరోయిన్ భారీగా డిమాండ్ చేసిందట. ఈ పాట కోసం దాదాపు కోటిన్నర వరకు అడుగగా.. చివరకు మేకర్స్ రూ. 1 కోటికి బేరమాడారని ఊహాగానాలు వస్తున్నాయి. కేవలం ఒక పాట కోసం అంత రెమ్యునరేషన్ అంటే ఇది భారీ ఒప్పందమనే చెప్పాలి.

ఇటీవల 'పుష్ప' సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి హీరోయిన్ సమంత అధిక పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు పూజా హెగ్డే కూడా ఒక సాంగ్ కోసం కోటి దాకా తీసుకోబోతోందని.. త్వరలోనే ఈ స్పెషల్ నంబర్ షూటింగ్ చేయనున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇకపోతే విజయ్ - పూజాహెగ్డే కాంబోలో రూపొందిన 'బీస్ట్' చిత్రాన్ని ఏప్రిల్ 13న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. దిల్ రాజు ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఇక అమ్మడు నటించిన 'ఆచార్య' ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'SSMB28' మూవీలో పూజా హీరోయిన్ గా నటించనుంది.

అలానే పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కలయికలో వస్తోన్న 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలో భాగం కానుంది. ఇక బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో 'సర్కస్' మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. ఇదే క్రమంలో సల్మాన్ ఖాన్ తో కలిసి ఓ సినిమాలో పూజా హెగ్డే నటించనుంది.