Begin typing your search above and press return to search.

ట్రంప్‌ తో డ్యాన్స్‌ చేయిస్తానంటున్న బాలీవుడ్‌ సింగర్‌ ..

By:  Tupaki Desk   |   22 Feb 2020 9:49 AM GMT
ట్రంప్‌ తో డ్యాన్స్‌ చేయిస్తానంటున్న బాలీవుడ్‌ సింగర్‌ ..
X
వచ్చే సోమవారం నుండి అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ప్రారంభం కాబోతుంది. ట్రంప్‌ ఆయన సతీమణి మెలానియా సహా ఆయన సలహాదార్లు ఇవాంకా ట్రంప్‌ - జారేద్‌ కుష్నర్‌ తో కలిసి భారత్‌లో రెండురోజులు పర్యటించనున్న సంగతి తెలిసిందే. దీనికోసం ఇప్పటికే భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లని పూర్తి చేసింది. ఇక ఇందులో భాగంగానే ..అహ్మదాబాద్ ని రంగులతో - ట్రంప్ -మోడీ బ్యానర్స్ తో నింపేశారు. ఇకపోతే , 24వ తేదీన అహ్మదాబాద్‌ లోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమం జరగనుంది.

ఈ సందర్భంగా బాలీవుడ్ సింగర్ కైలాష్‌ ఖేర్‌ తన పాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు. అయితే తన కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నానని కైలాష్‌ తెలిపారు. 'జై - జై-కారా - స్వామి సాత్‌ దేనా హమారా' పాటతో తన ప్రదర్శనను ప్రారంభించి.. 'బమ్‌ బమ్‌ లాహిరి' పాటతో ముగిస్తానని ఆయన తెలిపారు. అలాగే డొనాల్డ్‌ ట్రంప్‌ ను తన పాటకు డ్యాన్స్‌ చేయాలని కోరుకుంటున్నట్లు కైలాష్‌ ఖేర్‌ తెలిపారు. ఈయన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ భరత్ అనే నేను మూవీలో 'వచ్చాడయ్యో సామి' అనే సాంగ్ ను పాడింది ఈ కైలాష్ ఖేరే. ఆ పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇదే కాకుండా ఇంకా పలు తెలుగు పాటలు కైలాష్ ఖేర్ ఆలపించి.. టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.