Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ - బీజేపీలు నాకు టికెట్ ఆఫర్ చేశాయి : కంగనా

By:  Tupaki Desk   |   16 Aug 2020 1:30 AM GMT
కాంగ్రెస్ - బీజేపీలు నాకు టికెట్ ఆఫర్ చేశాయి : కంగనా
X
బాలీవుడ్ ‘క్వీన్’‌ కంగనా రనౌత్.. స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోంది. డేరింగ్ అండ్ డాషింగ్ అని పిలివబడే కంగనా హీరోయిన్ గానే కాకుండా దర్శకురాలిగా రచయితగా కూడా తన ప్రతిభను నిరూపించుకుంది. సినీ రాజకీయ సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకుంది. హీరోలకు సైతం సవాళ్లు విసురుతూ.. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేస్తూ వార్తల్లో ఉంటుంది. ఏదైనా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే కంగనా.. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలన రేపిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి పైనా తనదైన శైలిలో స్పందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోని నెపోటిజం పైన.. ఇండస్ట్రీలోని ప్రముఖులపైనా.. మహారాష్ట్ర సీఎం పైనా సంచలన ఆరోపణలు చేసింది. మొదటి నుండి ప్రధాని మోదీకి మద్ధతు తెలుపుతూ వస్తున్న కంగనా రాజకీయాల్లోకి వస్తారని.. అందుకే మోదీకి మద్దతు ఇస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

కంగనా ట్వీట్ చేస్తూ.. ''నేను రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతోనే మోదీజీ కి మద్దతు ఇస్తున్నానని భావించే ప్రతి ఒక్కరికీ ఒక విషయం సూటిగా చెప్తున్నాను. మా తాత వరుసగా 15 సంవత్సరాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. నా ఫ్యామిలీ రాజకీయాల్లో బాగా పాపులర్ అయింది. గ్యాంగ్ స్టర్ సినిమా తర్వాత దాదాపు ప్రతిసారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి నాకు టికెట్‌ ఆఫర్‌ వచ్చేది'' అని చెప్పింది. ''కాంగ్రెస్ నుంచే కాకుండా.. అదృష్టవశాత్తూ మణికర్ణిక చిత్రం తర్వాత బీజేపీ నుంచి కూడా నాకు టికెట్‌ ఆఫర్‌ వచ్చింది. ఒక ఆర్టిస్ట్‌ గా నా వర్క్ అంటే నాకు ఎంతో ప్రేమ. పాలిటిక్స్ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. ఇకనైనా ఈ ట్రోలింగ్‌ లు ఆపండి'' అంటూ కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది.