Begin typing your search above and press return to search.

పత్రికలో వార్తే.. ఇప్పుడు సినిమా

By:  Tupaki Desk   |   10 May 2017 4:47 AM GMT
పత్రికలో వార్తే.. ఇప్పుడు సినిమా
X
తన మొదటి సినిమా ‘పరుతివీరన్’తో తమిళ్ ప్రేక్షకులు దృష్టలో ఒక విలక్షణ నటుడు తెరపై పుట్టాడు అని అనిపించాడు కార్తి. ఆ తరువాత వచ్చిన సినిమాలు యుగానికి ఒక్కడు కూడా అలానే చేశాడు. తెలుగులో నా పేరు శివ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఆవారా ఊపిరి కాష్మోరా సినిమాలతో మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. చెలియా సినిమా నిరాశ పరిచిన ఇప్పుడు మరో కొత్త సినిమాతో తెలుగు తమిళ్ లో ఒకేసారి విడుదల కి సిద్దం అవుతున్నాడు.

కార్తీ హీరోగా వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ధీరన్‌ అధిగరమ్‌ ఒండ్రు’. ఇది ఒక యధార్ద కథ. 2005లో ఒక పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తునట్లు డైరెక్టర్ వినోద్ చెప్పారు. రియాలిటీకీ సాధ్యమైనంత దగ్గరగా ఉండేలా కార్తీ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెపుతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్‌ కోసం కొంతమంది పోలీసు అధికారులను కూడా వినోద్‌ కలిశారట. కథలో భాగంగా నార్త్ ఇండియాలో కూడా షూటింగ్‌ చేశారట. అయితే ఈ సినిమాలో ఇప్పుడు తెలుగు వారి కోసం కొన్ని సీన్లు షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఇక్కడ మార్కెట్ ఇంపార్టెంట్ కదా.

ఇకపోతే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కార్తీ కి జంటగా నటిస్తోంది. ఈ సినిమాలో అభిమన్యుసింగ్‌ ప్రతినాయకుడు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్స్‌ పతాకంపై ఎస్‌ ఆర్‌ ప్రభు నిర్మిస్తున్నారు. కాస్టింగ్ కూడా తెలుగుకి పరిచయం ఉన్నవారే సొ మళ్ళీ మన తమిళ్ తంబి తెలుగులోకి తన కొత్త సినిమాతో దూసుకొస్తాడు. ఈసారైనా హిట్టు కొడతాడేమో చూద్దాం.