Begin typing your search above and press return to search.

`ఆదిపురుష్ 3డి`లో మ‌హాన‌టి జాక్ పాట్?

By:  Tupaki Desk   |   2 March 2021 10:34 AM GMT
`ఆదిపురుష్ 3డి`లో మ‌హాన‌టి జాక్ పాట్?
X
డార్లింగ్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ `ఆదిపురుష్ 3డి` తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. 2022 ఆగ‌స్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే ముంబైలో ప్ర‌భాస్ అండ్ టీమ్ పై చిత్రీక‌ర‌ణ సాగుతోంద‌ని గుస‌గుసలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే ప్ర‌భాస్ ముంబైలో సంద‌డి చేసిన ఫోటోలు వీడియోలు వైర‌ల్ అయ్యాయి. అలాగే ఈ మూవీకి సంబంధించిన మోషన్ క్యాప్చర్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఈ క్రేజీ మూవీ రామాయ‌ణం ఆధారంగా రూపొందుతోంది. ఫిక్ష‌న‌ల్ పౌరాణిక క‌థాంశంలో ప్ర‌భాస్ శ్రీ‌రాముడిగా న‌టించ‌నుండ‌గా.. సైఫ్ ఖాన్ రావ‌ణుడిగా క‌నిపించనున్నారు.

మరోవైపు ఈ చిత్రంలో అత్యంత‌ కీలకమైన సీతాదేవి పాత్రను పోషించబోయే హీరోయిన్ ఎవ‌రు? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. ఇంత‌కుముందు ప‌లువురు బాలీవుడ్ నాయిక‌లు పేర్లు వినిపించాయి. కానీ అవేవీ మేకర్స్ ఇంకా లాక్ చేయలేదు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. చాలా పేర్లను పరిశీలించిన తరువాత చివ‌రికి ఓ సౌత్ నాయిక అయితే బావుంటుంద‌ని ఓంరౌత్ భావించార‌ట‌. సీత‌ పాత్ర కోసం మ‌హాన‌టి కీర్తి సురేష్ వైపు మొగ్గు చూపుతున్నార‌ని తెలిసింది. అయితే అధికారికంగా టీమ్ దీనిని ధృవీక‌రించాల్సి ఉంటుంది. మ‌హాన‌టి త‌ర్వాత కీర్తి సాంప్రాయ బద్ధ‌మైన పాత్ర‌ల‌కు సూట‌బుల్ అన్న చ‌ర్చ సాగింది. అందుకే ఇప్పుడు సీత‌గా ఆఫ‌ర్ త‌న‌ని వెతుక్కుంటూ వ‌చ్చింద‌ని అభిమానులు భావిస్తున్నారు. ప్ర‌ఖ్యాత టీ-సిరీస్ బ్యానర్ ఈ మూవీని దాదాపు 350కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించ‌నుంద‌ని ప్ర‌చారం సాగుతోంది.