Begin typing your search above and press return to search.

కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్న లస్ట్ బ్యూటీ...?

By:  Tupaki Desk   |   19 July 2020 2:30 AM GMT
కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్న లస్ట్ బ్యూటీ...?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది కియారా అద్వానీ. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో వెంటనే రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా పరాజయం పాలైనా కియారా అందాల ఆరబోతకు అవకాశం కల్పించింది. ‘ఫగ్లీ’ సినిమాతో తెరంగేట్రం చేసిన కియారా అద్వానీకి ‘ఎం.ఎస్.దోని ది అన్‌ టోల్డ్ కహాని’ సినిమాతో బ్రేక్ వచ్చిందని చెప్పవచ్చు. ఇక 'లస్ట్ స్టోరీస్'తో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘కబీర్ సింగ్’ సక్సెస్‌ తో బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతుంది కియారా. ఈ క్రమంలో ఇప్పుడు కోలీవుడ్ లో కూడా కియారా ఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలు వస్తున్నాయి.

కాగా తెలుగులో ఆల్రేడీ స్టార్ హీరోయిన్ స్టేట‌స్ కొట్టేసిన ఈ భామ‌కు ఇప్పుడు త‌మిళ ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయట. అది కూడా ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందట. ఇటీవల రజినీకాంత్ 'చంద్రముఖి 2' చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పి.వాసు దర్శకత్వంలో తలైవాతో కలిసి నటించబోతున్నానని ఇప్పటికే లారెన్స్ ప్రకటించారు. హార్రర్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'చంద్ర‌ముఖి' కి సీక్వెల్ గా రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియారాని సంప్రదించారట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇప్పటికే కియారా నటించిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'లక్ష్మీ బాంబ్' త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది. 'కాంచన' రీమేక్ గా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటించారు. దీంతో పాటు కార్తీక్ ఆర్యన్ తో కలిసి 'భూల్ భూలైయా 2' అనే హారర్ కామెడీ ఎంటర్టైనర్ లో కూడా కియారా నటిస్తోంది. మొత్తం మీద హారర్ సినిమాలకి కియారా ఏకైక ఛాయస్ గా మారుతున్నట్లుంది. అలానే 'ఇందూ కి జవానీ' మరియు అక్షయ్ కుమార్ - సిధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించనున్న 'షెర్షా' సినిమాలలో కూడా ఈ భామ నటిస్తోంది.