Begin typing your search above and press return to search.

కియారాను ఎవరూ గుర్తుపట్టనే లేదే

By:  Tupaki Desk   |   3 July 2018 10:04 AM GMT
కియారాను ఎవరూ గుర్తుపట్టనే లేదే
X
సెలబ్రిటీలంటే ఆకాశంలో తారల్లాంటి వాళ్లు. వాళ్లను సినిమా స్టూడియోల్లోనో.. షూటింగ్ సెట్లలోనో.. ఇంకా కుదిరితే ఏ టీవీ ఛానళ్లలోనో కనిపిస్తూ ఉంటారు. మామూలు జనాల్లాగా వీధుల్లో అలా జాలీగా తిరుగుతూ.. ఇష్టమైనది తిని.. నచ్చినది కొనుక్కోవడమంటే కష్టం. ఎందుకంటే వాళ్లు సెలబ్రిటీలు అని తెలిస్తే జనాలను కంట్రోల్ చేయడం కష్టం.

ఈ విషయంలో మహేష్ బాబు హీరోయిన్ కియారా అద్వానీ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించింది. షూటింగ్ కోసం తలపై దుపట్టా కప్పుకుని పెద్ద గాగుల్స్ పెట్టుకుని వీలైనంతవరకు తనను గుర్తు పట్టకుండా జాగ్రత్త పడింది. డైరెక్ట్ గా చార్మినార్ కు వెళ్లింది. చుట్టుపక్కల అంతా చూసింది. ఓ కోన్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేసింది. రోడ్డు పక్కన అమ్మే ఇమిటేషన్ జ్యూయలరీ కొనుక్కుంది. తరవాత మాంచి రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేసింది. మొత్తానికి హైదరాబాద్ లైఫ్ స్టయిల్ ను కామన్ పీపుల్ లాగా ఎంజాయ్ చేసింది. కియారా తీసుకున్న జాగ్రత్తలు వర్కవుట్ అవడంతో ఆమెను ఎవరూ నోటీస్ చేయలేదు.

కియారాకు హిస్టారికల్ ప్లేసెస్ కు వెళ్లడమంటే చాలా ఇష్టమంట. హైదరాబాద్ షూటింగ్ కు ఎప్పుడొచ్చినా బిజీబిజీ షెడ్యూల్ కావడం వల్ల పెద్దగా తిరగలేక పోయానంటోంది. ఈసారి కాస్త టైం చిక్కడంతో చార్మినార్ - సాలార్ జంగ్ మ్యూజియం అన్నీ చూసి బాగా ఎంజాయ్ చేసింది. హైదరాబాద్ సిటీ ఎట్టకేలకు చూడగలిగానని తెగ సంబరసపడుతోందీ భామ. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.