Begin typing your search above and press return to search.

ట్రోల‌ర్స్ కి కిర‌ణ్ అబ్బ‌వ‌రం స్మార్ట్ రిప్లై!

By:  Tupaki Desk   |   10 Jan 2023 9:03 AM GMT
ట్రోల‌ర్స్ కి కిర‌ణ్ అబ్బ‌వ‌రం స్మార్ట్ రిప్లై!
X
కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. 2019లో ర‌వికిర‌ణ్ కోల రూపొందించిన రొమాంటిక్ డ్రామా 'రాజా వారు రాణీగారు' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ ఫ‌ర‌వాలేద‌నిపించింది. ఆ త‌రువాత శ్రీ‌ధ‌ర్ గాదె డైరెక్ష‌న్ లో చేసిన 'ఎస్‌.ఆర్‌. క‌ల్యాణ మండ‌పం' కిర‌ణ్ అబ్బ‌వ‌రంకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇందులో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా స్టోరీ, స్క్రీన్ ప్లేని అందించి మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు.

ఈ మూవీకి చేత‌న్ భ‌ర‌ద్వాజ్ అందించిన ఆడియో యూట్యూబ్ లో వైర‌ల్ గా మారి ట్రెండ్ అయింది. అయితే ఈ మూవీ త‌రువాత కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టించి మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయి షాకిచ్చాయి. బాలాజీ స‌య్య‌పు రెడ్డితో చేసిన 'సెబాస్టియ‌న్ పీసీ 524', గోపీన‌థ్ రెడ్డితో చేసిన 'స‌మ్మ‌త‌మే', ..'ఎస్‌.ఆర్‌. క‌ల్యాణ మండ‌పం' వంటి హిట్ ని అందించిన‌ శ్రీ‌ధ‌ర్ గాదెతో చేసిన 'నేను మీకు బాగా కావాలసిన వాడిని' మూవీ కూడా కిర‌ణ్ అబ్బ‌వ‌రంకు చేదు అనుభ‌వాన్ని చ‌విచూపించింది.

దీంతో మ‌ళ్లీ హిట్టు కోసం కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఆశ‌గా ఎదురు చూస్తున్నాడు. అత‌ని ఆశ‌ల‌న్నీ ప్ర‌స్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పై బ‌న్నీ వాసు నిర్మిస్తున్న 'విన‌రోభాగ్య‌ము విష్ణుక‌థ‌'పైనే వున్నాయి. వ‌రుస ఫ్లాపుల్లో వున్నా కిర‌ణ్ అబ్బ‌వ‌రం డైరీ మాత్రం ఖాలీగా మాత్రం లేదు. 'విన‌రోభాగ్య‌ము విష్ణుక‌థ‌'తో పాటు కిర‌ణ్ అబ్బ‌వ‌రం మ‌రో రెండు సినిమాల్లో న‌టిస్తున్నాడు. అందులో ఒక‌టి 'మీట‌ర్'. ఈ మూవీని క్లాప్ ఎంట‌ర్ టైన్ మెంట్ తో క‌లిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు.

ఇక మరో మూవీ 'రూల్స్ రంజ‌న్‌'. ఏ.ఎం. ర‌త్నం స‌మ‌ర్ప‌ణ‌లో ఈ మూవీ రూపొందుతోంది. ఈ మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మంగ‌ళ‌వారం రిలీజ్ చేసిన 'విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌' టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. హీరోగా, రైట‌ర్‌గా, స్క్రీన్ ప్లే రైట‌ర్ గా త‌న టాలెంట్ ని చూపిస్తున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రంపై నెట్టింట ఓ నెటిజ‌న్ చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. దీనిపై కిర‌ణ్ అబ్బ‌వ‌రం చాలా స్మార్ట్ గా స్పందించి ట్రోల‌ర్స్ కి స్ట్రాంగ్ రిప్లై ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇటీవ‌ల ఓ నెటిజ‌న్ 'వాల్తేరు వీర‌య్య‌' ఈవెంట్ లో చిరు, ర‌వితేజ స్టేజ్ పై మాట్లాడుతున్న ఓ వీడియోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చిరంజీవి, ర‌వితేజ తామిద్ద‌ర‌మే ఇండ‌స్ట్రీలో ఎలాంటి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నామ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. ఇదే వీడియోకు చిరు కు కిర‌ణ్ త‌ల‌ని, ర‌వితేజ‌కు ఆది సాయి కుమార్ త‌ల‌ని అంటించి మీమ్ చేయ‌డంతో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హ‌ర్ట్ అయ్యాడు.

అలా చేసిన నెటిజ‌న్ కు వెంట‌నే త‌న‌దైన స్టైల్లో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. 'బ్ర‌ద‌ర్ నా 3 ఏళ్ల కెరీర్ లో 5 సినిమాలు మాత్ర‌మే చేశాను. నాకు తెలియ‌కుండా విడుద‌లైన ఇత‌ర సినిమాలు మీకు తెలిస్తే ద‌య‌చేసి నాకు తెలియ‌జేయండి' అంటూ రిప్లై ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.