Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ టీమ్ తో లేడీ సూప‌ర్ స్టార్ బిగ్ డీల్‌!

By:  Tupaki Desk   |   26 Nov 2022 10:30 AM GMT
కేజీఎఫ్ టీమ్ తో లేడీ సూప‌ర్ స్టార్ బిగ్ డీల్‌!
X
రాకింగ్ స్టార్ య‌ష్ తో 'కేజీఎఫ్‌' సిరీస్ ల‌ని అందించి పాన్ ఇండియా వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టించిన సంస్థ హోంబ‌లే ఫిలింస్. ఈ మూవీస్ తో ఈ సంస్థ ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ త‌రువాత ఈ సంస్థ నిర్మించిన 'కాంతార‌' కూడా 'కేజీఎఫ్‌' త‌ర‌హాలో సంచ‌ల‌నాలు సృష్టిస్తూ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ క‌న్న‌డ సినిమాల్లో స‌రికొత్త చ‌రిత్ర‌ని తిర‌గ‌రాస్తోంది. ఇప్ప‌టికే రూ. 400 కోట్ల మైలు రాయిని దాటి 'కేజీఎఫ్‌' రికార్డుని అధిగ‌మించింది.

క‌న్న‌డ‌లోనే కాకుండా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇదిలా వుంటే ఇలాంటి క్రేజీ మేక‌ర్స్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార తో బిగ్ డీల్ ని కుదుర్చుకున్న‌ట్టుగా తెలుస్తోంది. గ‌త ఏడేళ్లుగా ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ తో డేటింగ్ లో వున్న న‌య‌న‌తార ఈ ఏడాది జూన్ 9న ఫైన‌ల్ గా వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. పెళ్లైన నెల‌ల్లోనే ఈ ఇద్ద‌రు పేరెంట్స్ కావండ వివాదానికి దారి తీసింది.

అక్టోబ‌ర్ 9న న‌య‌న్ తంపతులు త‌మ‌కు ఇద్ద‌రు ట్విన్స్ పుట్టార‌ని ప్ర‌క‌టించ‌డం.. స‌రోగ‌సీ వ‌ళ్ల వీరికి సంతానం క‌లిగింద‌ని తేల‌డంతో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా స‌రోగ‌సీ ద్వారా సంతానాన్నిపొందారంటూ న‌య‌న దంప‌తుల‌పై వివాదం మొద‌లైంది. చివ‌రికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా ఓ క‌మిటీని ఏర్పాటు చేసి న‌య‌న దంప‌తుల స‌రోగ‌సీ వివాదానికి ఎండ్ కార్డ్ వేయ‌డంతో వివాదం స‌మ‌సి పోయింది. అప్ప‌టి నుంచి ఇద్ద‌రు పిల్ల‌ల‌తో న‌య‌న్ దంప‌తులు కాల‌క్షేపం చేస్తూ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో న‌య‌న‌తార సినిమాల‌కు దూరంగా వుంటుంద‌ని, ఇక సినిమాల్లో న‌టించ‌ద‌ని, కేవ‌లం నిర్మాత‌గా మాత్ర‌మే కొన‌సాగుతుంద‌ని కొత్త ప్రాజెక్ట్ లు అంగీక‌రించే అవ‌కాశం లేదంటూ వరుస క‌థ‌నాలు వినిపించాయి. అయితే ఆ వార్త‌ల‌కు చెక్ పెడుతూ న‌య‌న‌తార వ‌రుస అవ‌కాశాల్ని ఓకే చేసుకుంటూ వెళుతూ షాకివ్వ‌డం మొద‌లు పెట్టింది. త‌మిళంలో 'క‌నెక్ట్ ' అనే థ్రిల్ల‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న న‌య‌న‌తార మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ తో క‌లిసి మ‌రో సినిమా చేస్తోంది. ఈ రెండూ త్వ‌ర‌లో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

ఇదే ఏడాది షారుఖ్ ఖాన్ తో క‌లిసి 'జ‌వాన‌' మూవీతో న‌య‌న‌తార బాలీవుడ్ లోనూ అడుగుపెట్ట‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే హొంబ‌లే ఫిలింస్ నిర్మించ‌బోతున్న ఓ భారీ మూవీలో న‌టించ‌డానికి న‌య‌న‌తార గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా తెలిసింది. హీరోయిన్ ప్ర‌ధానంగా సాగే క‌థ‌గా ఈ మూవీ వుంటుంద‌ని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంద‌ని తెలుస్తోంది. కేజీఎఫ్‌, కాంతార తో సంచ‌ల‌నాలు సృష్టించిన హోంబ‌లే ఫిలింస్ న‌య‌న‌తార‌తో ఎలాంటి సంచ‌ల‌నానికి తెర తీసుబోతున్నారో వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.