Begin typing your search above and press return to search.

మారుతితో మూవీ.. హాట్ టాపిక్‌ గా ప్ర‌భాస్ పారితోషికం!

By:  Tupaki Desk   |   18 March 2022 5:31 AM GMT
మారుతితో మూవీ.. హాట్ టాపిక్‌ గా ప్ర‌భాస్ పారితోషికం!
X
రెబ‌ల్ స్టార్ నుండి నేష‌న‌ల్ స్టార్‌గా ఎదిగిన‌ ప్ర‌భాస్ చాలా కాలం త‌ర్వాత `రాధేశ్యామ్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మార్చి 11న భారీ స్థాయిలో విడుద‌లై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. రాధేశ్యామ్ ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో ప్ర‌భాస్ ఇక‌ పై ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తాన‌ని తెలిపిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయ‌న వ‌రుస ప్రాజెక్ట్‌ల‌ను లైన్‌లో పెడుతున్నారు.

గ‌త ఏడాదే ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్` చిత్రాన్ని పూర్తి చేసుకున్న ప్ర‌భాస్‌.. ఇప్పుడు `స‌లార్‌`, `ప్రాజెక్ట్-కె`ల‌ను చ‌క‌చ‌కా కానిచ్చేస్తున్నాడు. ఆ త‌ర్వాత సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్‌` అనే మూవీని ప్రారంభించ‌బోతున్నారు. అయితే వీటితో పాటే ప్రభాస్‌ డైరెక్టర్‌ మారుతితో ఓ పాన్‌ ఇండియా మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ వార్త‌లు వ‌స్తున్నాయి.

`రాజు డీలక్స్` అనే టైటిల్ ను ఈ మూవీకి ఖ‌రారు చేశార‌ట‌. `ఆర్ఆర్ఆర్‌` నిర్మాత డీవీవీ దాన‌య్య డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై నిర్మిబోతున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు మెర‌వ‌బోతున్నారు. మొద‌ట ఈ సినిమా కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నుంద‌ని ప్రచారం జ‌రిగింది. కానీ, మారుతి ప‌క్కా మాస్ మ‌సాలా స‌బ్జెక్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించ‌బోతున్నాట‌. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు కూడా వెళ్ల‌బోతోంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు ప్ర‌భాస్ అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్‌గా మారింది. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్రచారం ప్ర‌కారం.. ప్ర‌భాస్ ఈ మూవీకి అర‌వై రోజులు కాల్ షీట్స్‌ ఇవ్వ‌డం జ‌రిగింద‌ట‌. అందుకుగానూ ఆయ‌న రూ. 75 కోట్ల పారితోషికం ఛార్జ్ చేస్తున్నాడ‌ని అంటున్నారు. కాగా, బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌తి సినిమాకు ప్ర‌భాస్ వంద‌ కోట్ల‌కు త‌గ్గ‌కుండా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌నే టాక్ ఉంది. కానీ, ఇప్పుడు మారుతి ప్రాజెక్ట్‌కు పాతిక కోట్లు త‌గ్గించి తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.