Begin typing your search above and press return to search.

పూజాతో డిస్టెన్స్..కృతితో క్లోజ్ గా? ఏంటి డార్లింగ్!

By:  Tupaki Desk   |   9 March 2022 12:30 AM GMT
పూజాతో డిస్టెన్స్..కృతితో క్లోజ్ గా? ఏంటి డార్లింగ్!
X
'రాధేశ్యామ్' లో జంట‌గా న‌టించిన ప్ర‌భాస్-పూజాహెగ్డేలు ప్ర‌చార కార్య‌క్రమాల్లో ఎంత దూరం మెయింటెన్ చేసారో తెలిసిందే. ఒకరికి ఒక‌రు ఎదరుప‌డినా..ఒకే సినిమాని ప్ర‌మోట్ చేస్తున్నా ప‌ల‌కరించుకున్నా స‌న్నివేశం ఎక్క‌డా చోటు చేసుకోలేదు. ప‌ల‌క‌రింపు ప‌క్క‌న‌బెడితే క‌నీసం ఒక‌రి ముఖాలు ఒక‌రు కూడా చూసుకోలేదు.

ఈ స‌న్నివేశం చూసి కామ‌న్ ఆడియ‌న్ కే ఎన్నో సందేహాలు వ‌చ్చాయి. ఇక మీడియా ఏ రేంజ్ లో హైలైట్ చేసిందో చెప్పాల్సిన ప‌నిలేదు.

ఆన్ సెట్స్ లో ఇద్ద‌రి మ‌ధ్యా చోటు చేసుకున్న డిస్ట‌బెన్సెన్ కార‌ణంగా అలా వ్య‌వ‌హ‌రించార‌ని ప్ర‌చారం సాగింది. అలాగే 'రాధేశ్యామ్' షూటింగ్ స‌మ‌యంలో టీమ్ కి పూజాహెగ్డే స‌రిగ్గా స‌హ‌క‌రించ‌లేద‌ని హైలైట్ అయింది. ఆ కార‌ణంగానూ టీమ్ తో స‌ఖ్య‌త దెబ్బ‌తింద‌న్న‌ది అంతే ప్ర‌చారంలోకి వ‌చ్చింది. మ‌రి ఆ ఎడ ముఖం..పెడ ముఖానికి అస‌లు కార‌ణాలు అవేనా? ఇంకేవైనా ఉన్నాయా? అన్న‌ది తెలియాలి. పూజా సంగ‌తి ప‌క్క‌న‌బెడితే..

తాజాగా 'రాధేశ్యామ్' సినిమా ప్ర‌చారంలోనే 'ఆదిపురుష్' హీరోయిన్ కృతి స‌న‌న్ గురించి ఓ రేంజ్ లో ప్ర‌శంస‌లు కురిపించారు డార్లింగ్. ''సాధార‌ణంగా వ్య‌క్తుల‌ గురించి తెలుసుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం తీసుకుంటాను. ఎక్కువ‌గా ఎవ‌రితోనూ మాట్లాడ‌ను. కానీ కృతి స‌న‌న్ తో మాత్రం క్లోజ్ గా మూవ్ అవుతా. 'ఆదిపురుష్' సెట్స్ కి ఆమె వ‌స్తున్న‌ప్ప‌టి నుంచి ఎంతో సౌక‌ర్యంగా ఉంటున్నాను. కృతితో చాలా కంప‌ర్ట్ గా ఉంటాను. ఇద్ద‌రం జోకులేసుకుంటాం ''అని అన్నారు.

ఈ డిస్క‌ష‌న్ లో ఎక్కడా పూజా హెగ్డే గురించి ప్ర‌భాస్ మాట్లాడింది లేదు. 'ఆది పురుష్' లో ప్ర‌భాస్ జోడీగా కృతి స‌న‌న్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక 'ఆదిపురుష్ 'షూటింగ్ మొత్తం 103 రోజుల్లో పూర్తి చేసారు. అందులో కొన్ని రోజుల్లేనే ప్ర‌భాస్-కృతి స‌న‌న్ క్లోజ్ అయ్యారు. కానీ రెండు సంవ‌త్స‌రాల పాటు 'రాధేశ్యామ్' సినిమా కోసం ప‌నిచేసిన డార్లింగ్-బుట్ట‌బొమ్మ ల మ‌ధ్య మాత్రం ఆ త‌ర‌హా ప్రెండ్ షిప్ బిల్డ్ కాలేదు.

ఒక‌రంటే ఒక‌రు గిట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించారు. అంటే ఈ లెక్క‌న పూజా-ప్ర‌భాస్ ఒకే సినిమాలో వృత్తి ప‌రంగా కేవ‌లం క‌లిసి న‌టించారు త‌ప్ప స్నేహితులు కాలేక‌పోయారు అన్న‌ది హైలైట్ అవుతోంది. అదీ ప్ర‌భాస్ 'రాధేశ్యామ్' ప్ర‌మోష‌న్ లో 'ఆదిపురుష్' హీరుయిన్ ని హైలైట్ చేయ‌డం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.