Begin typing your search above and press return to search.

'రంగస్థలం' 'ఆచార్య' లొకేషన్స్ లో RC15..?

By:  Tupaki Desk   |   3 Feb 2022 2:30 AM GMT
రంగస్థలం ఆచార్య లొకేషన్స్ లో RC15..?
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ భారీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది శంకర్ శైలి సందేశాత్మక అంశాలతో కూడిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని టాక్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందే మైలురాయి 50వ చిత్రం కావడంతో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బడ్జెట్ కు ఏమాత్రం వెనకడకుండా తమ బ్యానర్ లో గుర్తుండిపోయేలా ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దాలనుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే స్టార్ కాస్టింగ్ - అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులను ఇందులో భాగం చేశారు.

తాజాగా RC15 షూటింగ్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. ఫిబ్రవరి 10 నుండి ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుందని సమాచారం. తూగో జిల్లాలతో చరణ్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

అక్కడ షూటింగ్ చేసిన రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలానే లేటెస్టుగా తన తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తున్న 'ఆచార్య' చిత్రంలోని కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ ని గోదావరి జిల్లాలోనే చిత్రీకరించారు. ఈ క్రమంలో ఇప్పుడు చరణ్-శంకర్ సినిమా కోసం మూడు వారాల షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారట.

మెగా హీరోలకు బాగా కనెక్ట్ అయిన తూర్పు గోదావరి పరిసర ప్రాంతాల్లో RC15 సాంగ్ షూట్ చేస్తారా లేదా టాకీ పార్ట్ షూటింగ్ జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇది శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా. పాన్ ఇండియా స్థాయిలో పలు ప్రధాన భారతీయ బాషల్లో రూపొందనుంది. 2023 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి - సునీల్ - శ్రీకాంత్ - జయరామ్ - నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.