Begin typing your search above and press return to search.

నాగ్ బాలీవుడ్‌ మూవీ షూటింగ్‌ పూర్తి

By:  Tupaki Desk   |   29 March 2022 7:30 AM GMT
నాగ్ బాలీవుడ్‌ మూవీ షూటింగ్‌ పూర్తి
X
బాలీవుడ్‌ కా బాహుబలి అంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న భారీ హిందీ చిత్రం 'బ్రహ్మాస్త్ర' షూటింగ్‌ పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఏడాది క్రితమే షూటింగ్‌ పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల ఇన్నాళ్లు షూటింగ్‌ సాగింది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది కదా.. వెంటనే నెల రెండు నెలల్లో వస్తుందని అనుకుంటే పొరపాటే. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్‌ 9వ తారీకున విడుదల చేయబోతున్నారు.

బాలీవుడ్‌ మెగా స్టార్ అమితాబచ్చన్‌.. యంగ్‌ స్టార్‌ హీరో రణబీర్ కపూర్‌.. బాలీవుడ్‌ సూపర్ స్టార్ హీరోయిన్‌ ఆలియా భట్.. టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జున ఇంకా మౌనీ రాయ్ ప్రముఖ నటీ నటులు నటించిన ఈ సినిమా కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను తెలుగు లో రాజమౌళి సమర్పించబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరిగాయి అనడంలో సందేహం లేదు.

ఈ సినిమా భారీ బడ్జెట్‌ తో అత్యంత భారీ సినిమా గా రూపొందిస్తున్నట్లుగా మేకర్స్‌ చెబుతున్నారు. విజువల్‌ వండర్ గా ఈ సినిమా ఉంటుందని... విజువల్ ఎఫెక్ట్స్ వర్క్‌ కోసమే షూటింగ్‌ పూర్తి అయినా ఇంకా ఆరు నెలల ఆలస్యం అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

బాహుబలి రేంజ్ లో ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్స్ ను మరియు వీఎఫ్‌ఎక్స్ వర్క్ ను వినియోగిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ వర్క్ దేశ విదేశాల్లో అత్యున్నత టెక్నీషియన్స్‌ సారధ్యంలో సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున నటించడం వల్ల తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా బడ్జెట్‌ మొదట అనుకున్నదానికి దాదాపుగా రెండు రెట్లు పెరిగినట్లుగా తెలుస్తోంది. అయినా కూడా ఖచ్చితంగా సినిమా ఒక అద్బుతం అన్నట్లుగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఈమద్య కాలంలో భారీ బడ్జెట్‌ సినిమాలకు ఒక మోస్తరు టాక్ వచ్చినా కూడా వసూళ్ల వర్షం కురుస్తుంది. కనుక ఖచ్చితంగా బ్రహ్మాస్త్ర సినిమాకు కూడా భారీగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఆలియా భట్‌మరియు రణబీర్‌ కపూర్‌ ల మద్య రొమాన్స్ తో పాటు అమితాబచ్చన్ మరియు నాగార్జునల సన్నివేశాల కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా కాన్సెప్ట్‌ నచ్చి రాజమౌళి ఈ సినిమా ను సమర్పించేందుకు ముందుకు వచ్చారనేది టాక్‌.