Begin typing your search above and press return to search.

సర్కారు వారి సందడి సాఫీగా సాగేనా..??

By:  Tupaki Desk   |   14 April 2022 9:30 AM GMT
సర్కారు వారి సందడి సాఫీగా సాగేనా..??
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ పరుశురామ్ పెట్లా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''సర్కారు వారి పాట''. ఒక పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందని మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. త్వరలోనే బ్యాలన్స్ సాంగ్ ను కూడా చిత్రీకరించి, మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీద దృష్టి పెట్టనున్నారు.

'సర్కారు వారి పాట' చిత్రాన్ని సమ్మర్ కానుకగా 2022 మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చెబుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో సమస్యలు ఉన్నాయని.., సినిమా వచ్చే నెల మొదటి వారానికి వాయిదా పడే అవకాశం ఉందని నెట్టింట రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

ఇవాళ గురువారం (ఏప్రిల్ 14) థియేటర్లలోకి వచ్చిన 'కేజీఎఫ్: చాప్టర్ 2' సినిమా బాక్సాఫీస్ వద్ద మరికొన్ని రోజులు వీరవిహారం చేసేలా కనిపిస్తోంది. పార్ట్-1 కు మించి యాక్షన్ అండ్ ఎలివేషన్స్ సీన్స్ తో రూపొందించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అయితే 50 రోజులపాటు థియేటర్లలో ఆడించే అవకాశం ఉంది.

ఇక చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మెగా తండ్రీకొడుకులు నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే చాలా వరకు మెయిన్ థియేటర్లను బ్లాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 12న 'సర్కారు వారి పాట' చిత్రానికి అధిక థియేటర్లు దొరకడం కష్టమే అనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో SVP చిత్రాన్ని జూన్ 3న విడుదల చేసే ఛాన్స్ ఉందని.. ఇప్పుడు ఈ ఇష్యూ మహేష్ టేబుల్ పై ఉందని అంటున్నారు. ఒకవేళ సూపర్ స్టార్ దీనికి ఓకే చెప్తే మాత్రం.. జూన్ 10న రిలీజ్ ప్లాన్ చేసిన నాని 'అంటే సుందరానికీ!' సినిమా విడుదలకు అడ్డంకిగా మారుతుంది. ఎందుకంటే ఈ రెండు చిత్రాలను మైత్రీ వారే నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే గతంలో మే నెలలో విడుదలైన మహేష్ బాబు చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. 'నాని', 'నిజం', బ్రహ్మోత్సవం', 'స్పైడర్' వంటి సినిమాలు అదే నెలలోనే థియేటర్లలోకి వచ్చి నిరాశ పరిచాయి. ఒక్క 'మహర్షి' మూవీ మాత్రమే బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. మహేష్ 'మే' సెంటిమెంటును చూసి అభిమానులు కలవరపడుతున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతానికైతే ఇవేమీ పట్టించుకోని 'సర్కారు వారి..' మేకర్స్ మే 12న విడుదల అని ప్రచారం చేస్తూ వస్తున్నారు. త్వరలోనే ఎగ్జైటింగ్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు - గ్లిమ్స్ - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

'కళావతి' మరియు 'పెన్నీ' పాటలు మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. త్వరలోనే 'మురారి బావ' అనే మూడో పాటను తీసుకొస్తారని సోషల్ మీడియాలో టాక్స్ నడుస్తున్నాయి. బ్యాంకుల కుంభకోణాలు - ఆర్థిక నేరగాళ్లను టార్గెట్ చేస్తూ 'సర్కారు వారి పాట' చిత్రాన్ని రూపొందిస్తున్నారని చాలా రోజులుగా ప్రచారంలో ఉంది.

ఇందులో మహేశ్ బాబు సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సముద్ర ఖని - ప్రకాశ్ రాజ్ - సుబ్బరాజు - వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - 14 రీల్స్ ప్లస్ మరియు GMB ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.