Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్‌' క్లైమాక్స్ ని పూజా ఐడియాతో చేసి ఉంటే..!

By:  Tupaki Desk   |   15 March 2022 1:30 AM GMT
రాధేశ్యామ్‌ క్లైమాక్స్ ని పూజా ఐడియాతో చేసి ఉంటే..!
X
ప్రభాస్ హీరోగా పూజాహెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన రాధేశ్యాం సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కోసం మూడేళ్లుగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు రాధేశ్యాం విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి దాదాపుగా నాలుగు సంవత్సరాలు అవుతోంది. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన రాధేశ్యాం సినిమా తాజాగా విడుదల అవడంతో ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా సినిమాను చూసేందుకు మొదటి రోజే థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున క్యూ కట్టారు.

రాధేశ్యాం సినిమాకు మిశ్రమ స్పందన దక్కింది. కొన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంటే కొందరు ప్రేక్షకులు మాత్రం సినిమా విషయంలో పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ మరియు పూజా హెగ్డే ల మధ్య లవ్ సీన్స్ మరియు రొమాంటిక్ సన్నివేశాలని దర్శకుడు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తెరకెక్కించలేక పోయాడు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సమయంలో పూజ హెగ్డే పాత్ర గురించి మరియు ఆమె లుక్ గురించి కూడా సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ప్రేరణ పాత్రకు పూజ హెగ్డే లుక్స్ పరంగా న్యాయం చేసింది కానీ నటన పరంగా ఆమె న్యాయం చేయలేక పోయింది అనేది సోషల్ మీడియా టాక్. కొన్ని సన్నివేశాల్లో ఆమె యాక్టింగ్ మరీ పూర్‌ గా ఉందని.. ప్రభాస్ తో ఉన్న సన్నివేశాల్లో ఆమె ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో ప్రేరణ పాత్ర చనిపోతే బాగుంటుంది అంటూ పూజాహెగ్డే దర్శకుడు రాధాకృష్ణ కు సలహా ఇచ్చిందంట. ఆమె సలహా ను దర్శకుడు రాధాకృష్ణ మరియు చిత్ర నిర్మాతలు ఇంకా యూనిట్ సభ్యులు సున్నితంగా తిరస్కరించారట. సగటు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమా క్లైమాక్స్ ఉండాలనే ఉద్దేశంతో హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా చివర్లో బతుకుతారు.

పూజా హెగ్డే చెప్పిన దాని ప్రకారం ప్రేరణ పాత్ర ని చంపేసి ఉంటే కచ్చితంగా ఆ పాత్ర ఒక క్లాసిక్ నిలిచిపోయేది అనేది కొందరి అభిప్రాయం. ఎందుకంటే సూపర్‌ హిట్‌ లవ్ స్టోరీ సినిమాలు చాలా వరకు యాంటీ క్లైమాక్స్ ఉన్నా కూడా ప్రేక్షకులు ఆదరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. గీతాంజలి నుండి మొదలు పెట్టుకొని ఎన్నో సినిమాలు యాంటీ క్లైమాక్స్ తో ముగిసిన సినిమాలు చాలా ఉన్నాయి.

కనుక ఈ సినిమాలో కూడా యాంటీ క్లైమాక్స్ ఉండి ఉంటే బాగుండేది అనేది కొందరు అభిప్రాయం. పూజా హెగ్డే కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా కూడా ఆమె ఐడియాను ఏ ఒక్కరు పట్టించుకోలేదు. ఒకవేళ ఆమె ఐడియా బాగుందని అనుకున్నా సినిమా లో పెట్టేంత సాహసాన్ని మాత్రం చిత్ర యూనిట్ సభ్యులు చేసేందుకు సిద్దపడక పోయేవారు. ఇండియన్ సినీ ప్రేక్షకులకు యాంటీ క్లైమాక్స్ అసలు పడదు అని గతంలో నిరూపితం అయ్యింది. అందుకే వారి అభిరుచికి తగ్గట్లు గానే చివర్లో హీరో హీరోయిన్ పెళ్ళి చేసి మరీ శుభం కార్డు వేశారు.