Begin typing your search above and press return to search.

వెంకీ అందుకే త‌ప్పుకున్నారా?

By:  Tupaki Desk   |   6 March 2022 3:30 AM GMT
వెంకీ అందుకే త‌ప్పుకున్నారా?
X
గ‌త కొంత కాలంగా ఒక హీరో సినిమా మ‌రో హీరోకి వెళ్ల‌డం.. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డం జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో చేతులు మారిన కొన్ని చిత్రాలు డివైడ్ టాక్ ని ద‌క్కించుకున్న‌వీ వుంటున్నాయి. తాజాగా ఓ సీనియ‌ర్ హీరో చేయాల్సిన సినిమా యంగ్ హీరో చేతికి వెళ్లింది. అదే `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు`. యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ మూవీ మార్చి 4న థియేట‌ర్ల‌లో విడుద‌లైంది.

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంపై రిలీజ్ కు ముందు నుంచి మంచి బ‌జ్ క్రియేట్ అయింది. అయితే అది థియేట‌ర్ల‌కు వ‌చ్చేస‌రికి డివైట్ టాక్ గా మారింది. గ‌త కొంత కాలంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డం లేదు. వారిని థియేట‌ర్ల‌కు ర‌ప్పించాల‌నే ఉద్దేశ్యంతో చ‌క్క‌ని ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ మూవీని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల‌.

అయితే ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నం నూటికి నూరు శాతం ఫ‌లించిన‌ట్టుగా క‌నిపించ‌డం లేద‌ని, ఎంచుకున్న పాయింట్ డీవేట్ కావ‌డంతో శ‌ర్వా భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీకి డివైడ్ టాక్ ఎదురైంద‌ని చెప్పుకుంటున్నారు.

ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన టాక్ ఫిల్మ్ స‌ర్కిల్స్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్స్ చేయాలంటే ఇప్పుడున్న ఏకైక హీరో విక్ట‌రీ వెంక‌టేష్ మాత్ర‌మే. ఆయ‌న ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని దృష్టిలో పెట్టుకుని చేసిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాల్ని సాధించాయి. `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` చిత్రాన్ని ఆయ‌న చేసి వుంటే ఎలా వుండేదో అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అనుకుంటున్నాయ‌ట‌. ముందు ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల విక్ట‌రీ వెంక‌టేష్ తో చేయాల‌నుకున్నారు.

నిత్యామీన‌న్ హీరోయిన్. నారాయ‌ణ్ దాస్ నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు నిర్మాత‌లు. అయితే అప్ప‌టికే వెంక‌టేష్ పెళ్లి కాని ప్ర‌సాద్ త‌ర‌హా పాత్ర‌లో `మ‌ళ్లీశ‌ర్వ‌రి` చిత్రం చేసి వుండ‌టంతో ఈ ప్రాజెక్ట్ ని తిర‌స్కరించి వుండ‌వ‌చ్చిని. అదే క‌థ‌కు మార్పులు చేసిన కిషోర్ తిరుమ‌ల యంగ్ హీరో శ‌ర్వానంద్ కు వినిపించి సినిమా చేశార‌ని, అయితే ఈ పాయింట్ తో విక్ట‌రీ వెంక‌టేష్ సినిమా చేసి వుంటే ఫ్యామిలీ ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌కు వ‌చ్చేవార‌ని. అభిమానుల‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయ‌ట‌.

విక్టరీ వెంక‌టేష్ తో పాటు శ‌ర్వానంద్ కు ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో మంచి ఫాలోయింగ్ వుంది. అయితే అది ఈ సినిమా విష‌యంలో ఫ‌లితాల్ని అందించ‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఎంచుకున్న క‌థ‌ని స‌రిగా ప్ర‌జెంట్ చేయ‌క‌పోవ‌డ‌మేన‌ని అనుకున్న విధంగా తెర‌పైకి తీసుకొచ్చివుంటే బాగుండేద‌ని చెబుతున్నారట‌.