Begin typing your search above and press return to search.

ఆ మలయాళ రీమేక్ లో నటించే హీరోలు ఎవరు...?

By:  Tupaki Desk   |   9 Jun 2020 9:10 AM GMT
ఆ మలయాళ రీమేక్ లో నటించే హీరోలు ఎవరు...?
X
'అయ్యప్పనుమ్ కోసియుమ్'... ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇది మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించిన ఒక సినిమా. ఈ సినిమాలో పృథ్వీరాజ్ - బిజూ మీనన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఇగో వల్ల వాళ్ళ జీవితాల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో 'అయ్యప్పనుమ్ కోసియుమ్' కథ నడుస్తుంది. ఈ సినిమాని మలయాళ ప్రేక్షకులు ఆదరించారు. దీంతో ఈ సినిమాను ఇతర దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు చూస్తున్నారు. మన టాలీవుడ్ విషయానికి వస్తే ఈ సినిమా రీమేక్ రైట్స్ సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్య దేవర నాగవంశీ సొంతం చేసుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ లో ఎవరు నటించబోతున్నారు అని చాలా రోజుల నుండి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. పృథ్వీరాజ్ - బిజూ మీనన్ లు తమ పాత్రలను చాలా చక్కగా పోషించి చిత్ర విజయానికి కారణమయ్యారు. మరి తెలుగు రీమేక్ లో అలాంటి పాత్రల్లో ఏ హీరోలు నటిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ సినిమాని దగ్గుబాటి రానా చూసి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడట. అంతేకాకుండా మరో పాత్ర కోసం మాస్ మహారాజా రవితేజని సంప్రదించారట చిత్ర యూనిట్. అయితే మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి స్క్రిప్ట్ వినిపిస్తే నటించడానికి రెడీగా ఉన్నట్లు రవితేజ చెప్పుకొచ్చాడట. దీంతో ఈ ప్రాజెక్టులో హీరోలు ఎవరనే దాని మీద ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరనేది ఇప్పుడు మరో ప్రశ్న. ఎందుకంటే రీమేక్ చిత్రాలను అందరూ హ్యాండిల్ చేయలేరు. మన నేటివిటీకి తగ్గట్లు స్టోరీ మార్చినా సక్సెస్ అయిన వారు కొంతమందే. అందుకే సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు తెలుగులో మార్పులు చేర్పులు చేయగలిగే డైరెక్టర్ కోసం వెతుకులాట స్టార్ట్ చేశారట. దీనికి తగిన డైరెక్టర్ దొరికిన వెంటనే ఇద్దరు హీరోలను బ్యాలన్స్ చేస్తూ స్టోరీని రెడీ చేపించాలనుకుంటున్నారట. డైరెక్టర్ దొరికిన వెంటనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించాలని చిత్ర నిర్మాతలు వెయిట్ చేస్తున్నారట. కాకపోతే రవితేజ - రానా ప్రస్తుతం చాలా సినిమాకి కమిట్ అయి ఉన్నారు. ఆ ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాతే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు.