Begin typing your search above and press return to search.

'లైగర్' సాంగ్ టీజర్: తల్లీ కొడుకుల మధ్య ఓ బ్యూటిఫుల్ డ్రామా క్వీన్..!

By:  Tupaki Desk   |   4 Aug 2022 11:18 AM GMT
లైగర్ సాంగ్ టీజర్: తల్లీ కొడుకుల మధ్య ఓ బ్యూటిఫుల్ డ్రామా క్వీన్..!
X
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ''లైగర్''. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. రెగ్యులర్ గా క్రేజీ అప్డేట్స్ వదులుతూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తున్నారు.

ఇప్పటికే 'లైగర్' టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్స్ - గ్లింప్స్ - టీజర్ - ట్రైలర్ కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే 'ద లైగర్ హంట్ థీమ్' - 'అక్డి పక్డి' - 'వాట్ లగా దేంగే' వంటి పాటలు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ రాబట్టాయి. ఈ క్రమంలో మరో సాంగ్ ని విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు.

ఈసారి 'లైగర్' నుంచి 'ఆఫట్' (Aafat) అనే ఓ రొమాంటిక్ సాంగ్ కు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఈ సాంగ్ వీడియో టీజర్ ను వదిలారు. 'తల్లీ కొడుకుల మధ్యకు వచ్చే ఓ బ్యూటీఫుల్ డ్రామా క్వీన్ ఎప్పుడూ ఉంటుంది' అంటూ విడుదల చేసిన ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది.

ఇందులో విజయ్ దేవరకొండ ఇంటి వద్దకు వచ్చిన హీరోయిన్ అనన్య పాండే.. ఇంట్లోకి వస్తానని లైగర్ ను బ్రతిమాలుకుంటోంది. అయితే మన హీరో మాత్రం రావొద్దని చెబున్నాడు. దీనికి కారణం ఇంట్లో అతని తల్లి రమ్యకృష్ణ కూడా ఉండటమే. అయినప్పటికీ ఆమె కంటపడకుండా ఇద్దరూ మీట్ అవ్వడాన్ని 'ఆఫట్' ప్రోమోలో చూడొచ్చు.

విజయ్ - అనన్య జోడీ చాలా బాగుంది. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా కుదిరినట్లు తెలుస్తోంది. అలానే అనన్య వైట్ డ్రెస్ లో చాలా అందంగా హాట్ గానూ కనిపిస్తోంది. ఆమె క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి. 'ఆఫట్' ఫుల్ సాంగ్ ను రేపు (ఆగస్ట్ 5) సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

'లైగర్' చిత్రానికి మల్టిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సాంగ్ కు బాలీవుడ్ కంపోజర్ తనీష్ బాగ్చి ట్యూన్ సమకూర్చడమే కాదు.. జాహ్రా ఖాన్ తో కలిసి ఆలపించారు. దీనికి రష్మీ విరాగ్ లిరిక్స్ అందించారు.

ముంబై స్లమ్స్ లో పెరిగిన ఒక చాయ్ వాలా.. ఇంటర్నేషనల్ బాక్సర్ గా ఎలా ఎదిగాడనేది 'లైగర్' సినిమాలో చూపించబోతున్నారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇందులో కీలక పాత్ర పోషించారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్ గా.. కెచా స్టంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

'లైగర్' చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ - ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ - ఛార్మి కౌర్ - కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మించారు. ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.