Begin typing your search above and press return to search.

గాడిదల అరుపులు పట్టించుకోం...

By:  Tupaki Desk   |   8 Dec 2018 1:30 AM GMT
గాడిదల అరుపులు పట్టించుకోం...
X
ఇటీవలే వివాహం చేసుకున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా, అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జొనస్‌ లు చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇద్దరు కూడా ఇంకా పెళ్లి మూడ్‌ నుండి బయటకు వచ్చినట్లుగా లేరు. పెళ్లి అయిన కొన్ని గంటలకే అమెరికాకు చెందిన ది కట్‌ అనే ప్రముఖ పత్రిక ఈ జంట గురించి కథనం రాయడం జరిగింది. ప్రియాంక చోప్రా మాయ చేసి నిక్‌ ను పెళ్లి చేసుకుంది అంటూ ది కట్‌ తన కథనంలో పేర్కొన్న విషయం తెల్సిందే. ఆ కథనంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ కథనంను డిలీట్‌ చేస్తున్నట్లుగా స్వయంగా ది కట్‌ ప్రకటించిన విషయం కూడా తెల్సిందే. ది కట్‌ కథనం తొలగించినా కూడా ఇంకా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

ఈ ఇష్యూపై తాజాగా ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. నా కూతురు తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమె ప్రస్తుతం చాలా సంతోషంగా ఉంది. కొత్త వధూవరులతో పాటు తమ కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఇలాంటి సమయంలో కొన్ని కథనాలు మమ్ములను ఏమాత్రం డిస్ట్రబ్‌ చేయలేవు అంది.

కొంత మంది ఫూల్స్‌ రాసిన కథనాల గురించి మేము పట్టించుకోవాలని భావించడం లేదు. వారు రాసిన వాటికి పబ్లిసిటీ ఇవ్వాలనుకోవడం లేదు. చెత్త పనులు చేసే గాడిదలు ఉంటాయి. ఆ గాడిదల అరుపులు పట్టించుకోం అంటూ మధు చోప్రా అన్నారు. ఈ వార్తలపై ప్రియాంక చోప్రా కూడా స్పందించిన విషయం తెల్సిందే. అలాంటి వార్తలను తాను పెద్దగా పట్టించుకోనంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. అంతర్జాతీయ మీడియాలో ప్రస్తుతం ప్రియాంక చోప్రా మరియు నిక్‌ ల వివాహం గురించి పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి.