Begin typing your search above and press return to search.

గుడులు రిపేర్‌ చేయిస్తున్న హీరోయిన్‌

By:  Tupaki Desk   |   20 Oct 2015 4:51 AM GMT
గుడులు రిపేర్‌ చేయిస్తున్న హీరోయిన్‌
X
గుడులు గోపురాలు అంటూ ప్ర‌ద‌క్షిణాలు చేసేందుకు నేటి సెల‌బ్రిటీల‌కు టైమెక్క‌డిది? క్ష‌ణం తీరిక లేని షెడ్యూళ్ల‌తో ఎప్ప‌డూ బిజీనే. అలాంటిది ఈ అమ్మ‌డు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తోంది. ఏకంగా గుడులు - గోపురాల్ని సంస్క‌రించే ఓ ఆర్గ‌నైజేష‌న్‌ తో క‌లిసి త‌నవంతుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేస్తోంది. గుడులు బాగు చేస్తాం - గోపురాలు పున‌ర్నిర్మిస్తాం అంటూ ఊరూ వాడా ప్ర‌చారం చేస్తోంది. సేవ్ టెంపుల్స్ ఆర్గ‌నైజేష‌న్‌ తో క‌లిసి ఏడాది కాలంగా దాదాపు 10 గుడుల్ని రిపేర్ చేయించింది.

ఇప్ప‌టికే భార‌త‌దేశ క‌ల్చ‌ర్ నాశ‌న‌మైపోతోంది. ఒక‌ప్ప‌టి గుడులు - దేవాల‌యాల క‌ల్చ‌ర్ పూర్తిగా కిందికి ప‌డిపోతోంది. దేవాల‌యాల‌న్నీ విధిలావ‌స్త‌కు చేరుకుంటున్నాయి. ఇలాంటి వాట‌ని గుర్తించి స‌ద‌రు సంస్థ వాటి రిపెయిర్‌ ల కోసం బోలెడంత స‌మ‌యాన్ని - ధ‌నాన్ని వెచ్చించి పునఃప్ర‌తిష్ఠ చేస్తోంది. ఆ సంస్థ‌కు బాస‌ట‌గా నిలుస్తూ మ‌ధుశాలిని ఈ మంచి ప‌నులు చేస్తోంది. ఒకే త‌ర‌హాలో ఆలోచించే ఇలాంటివారంతా క‌లిసి చేస్తున్న స‌త్కార్య‌మిదని మ‌ధుశాలిని చెప్పింది. ఓ వైపు ర‌క్తి, మ‌రోవైపు ముక్తి ఏక‌కాలంలో ప్లాన్ చేసింది ఈ తెలుగు హీరోయిన్‌. మ‌ధుశాలిని న‌టించిన తూంగ‌వ‌నం (చీక‌టిరాజ్యం) త్వ‌ర‌లోనే రిలీజ్‌ కి రానుంది. ఈ సినిమాతో తెలుగు - త‌మిళ్‌ లోనూ పాపులారిటీ పెంచుకుని గుడులు - గోపురాల్ని ప్ర‌మోట్ చేస్తుందేమో చూడాలి.