Begin typing your search above and press return to search.

ఫిలింఫేర్ లో మ‌హాన‌టి ఉత్స‌వం

By:  Tupaki Desk   |   23 Dec 2019 3:50 AM GMT
ఫిలింఫేర్ లో మ‌హాన‌టి ఉత్స‌వం
X
మ‌హాన‌టి టీమ్‌ కు ఇదొక ప్రౌడ్ మూవ్ మెంట్‌. 66వ ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్-2019 చెన్నైలో అట్ట‌హాసంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో తెలుగు- త‌మిళ‌- మ‌ల‌యాళ‌- క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌ కు చెందిన బిగ్ సెల‌బ్రిటీస్ పాల్గొన్నారు. తార‌ళ త‌ళుకుల మ‌ధ్య జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి యంగ్ హీరో సందీప్ కిష‌న్‌-రెజీనా క‌సాండ్ర హోస్ట్ లుగా వ్య‌వహ‌రించారు. ఈ అవార్డుల్లో ప‌లు చిత్రాలు అవార్డుల‌కు పోటీపడ్డాయి. రంగ‌స్థ‌లం- మ‌హాన‌టి చిత్రాల‌కు అగ్ర తాంబూలం ద‌క్కింది. ముఖ్యంగా బ్లాక్ బ‌స్ట‌ర్ `మ‌హాన‌టి` చిత్రానికి ఏకంగా నాలుగు పుర‌స్కారాలు ద‌క్కాయి.

ఉత్త‌మ చిత్రం అవార్డ్ తో పాటు.. ఉత్త‌మ న‌టిగా కీర్తి సురేష్‌- ఉత్త‌మ ద‌ర్శ‌కుడుగా నాగ్ అశ్విన్‌- క్రిటిక్స్ ఉత్త‌మ న‌టుడుగా దుల్క‌ర్ స‌ల్మాన్ అవార్డుల్ని సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు వేడుక‌లో పుర‌స్కారాల్ని అందుకున్న నిర్మాత‌లు ప్రియాంక ద‌త్‌- స్వ‌ప్నాద‌త్‌- ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ షీల్డ్స్ ప‌ట్టుకుని గ‌ర్వం తో దిగిన ఫొటో సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అవుతోంది. సినిమా ప్రారంభం లో ఎన్ని విమ‌ర్శ‌లు ఎదురైనా స‌క్సెస్‌ పై గ‌ట్టి న‌మ్మ‌కం తో ప‌నిచేశారు. ఆ న‌మ్మ‌కానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్క‌డంతో ఆ విజ‌య గ‌ర్వం వారి ముఖాల్లో స్ప‌ష్టం గా క‌నిపించ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.

జాతీయ పుర‌స్క‌రాల్లో `మ‌హాన‌టి` చిత్రానికి మూడు విభాగాల్లో పుర‌స్కారాలు ల‌భించాయి. దాంతో టాలీవుడ్ గ‌ర్వంగా ఫీలైంది. తాజాగా ఫిల్మ్ ఫేర్ లో నాలుగు అవార్డులు ద‌క్క‌డంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ఆనందానికి అవ‌ధుల్లేవ్. వైజ‌యంతి కి అనుబంధంగా త్రీ ఏంజెల్స్ బ్యాన‌ర్ స్థాపించిన స్వ‌ప్ప‌ద‌త్- ప్రియాంక ద‌త్ .. త‌మ కెరీర్ బెస్ట్ హిట్ ని మ‌హాన‌టి రూపం లో అందుకున్న సంగ‌తి తెలిసిందే.