Begin typing your search above and press return to search.

స్టార్ ఫ్యాన్స్ మ‌ధ్య మ‌ళ్లీ పిచ్చి పీక్స్ కి చేరిందా?

By:  Tupaki Desk   |   23 April 2022 3:30 AM GMT
స్టార్ ఫ్యాన్స్ మ‌ధ్య మ‌ళ్లీ పిచ్చి పీక్స్ కి చేరిందా?
X
స్టార్ హీరోలు ఎన్ని చెప్పినా ఫ్యాన్స్ మాత్రం మార‌డం లేదు. ఎప్ప‌టి లాగే సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శలు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో ర‌చ్చ చేస్తూనే వున్నారు. హ‌ద్దులు దాటి కామెంట్ లు చేసుకుంటూ వివాదాలు సృష్టిస్తున్నారు. టాలీవుడ్ లో వున్న క్రేజీ స్టార్స్ మ‌హేష్ బాబు, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. ఈ ముగ్గురి మ‌ధ్య మంచి స్నేహ బంధం వున్న విష‌యం తెలిసిందే. హీరోల‌తో పాటు వారి వైఫ్ లు కూడా ఫ్రెండ్లీ వాతావ‌ర‌ణంలో క‌లిసిపోతుంటారు.

ఈ ముగ్గురు స్టార్ హీరోలు క‌లిసి ఆ మ‌ధ్య ఓ ప్రైవేట్ పార్టీ చేసుకోవ‌డం.. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్న విష‌యం తెలిసిందే. అది చూసి కూడా ఇటీవ‌ల ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వార్ డిక్లేర్ చేశారు. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి తొలి సారి ట్రిపుల్ ఆర్ లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం గానూ, చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు గానూ న‌టించారు.

అయితే సినిమా రిలీజ్ త‌రువాత మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ర‌చ్చ ర‌చ్చ చేశారు. అంతే కాకుండా సినిమాలో మా హీరో పాత్ర‌కే ప్రాధాన్య‌త‌నిచ్చార‌ని చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తే లేదు మా హీరో కే ప్రాధాన్య‌త‌నిచ్చార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా యుద్ధం చేశారు. తాజాగా `ఆచార్య‌` చిత్రం మ‌హేష్ బాబు, చ‌ర‌ణ్ అభిమానుల మ‌ధ్య స‌రికొత్త ర‌చ్చ‌కు కార‌ణంగా నిలిచింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించ‌గా రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

`ధ‌ర్మ‌స్థ‌లి` నేప‌థ్యంలో సాగే ఈ చిత్రానికి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు వాయిస్ ఓవ‌ర్ అందించారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌హేష్‌ని అభినందిస్తూ పోస్ట్ పెట్టారు. ఇదే విష‌యాన్ని చ‌ర‌ణ్ కూడా ట్వీట్ చేశారు. అయితే మ‌హేష్ అంటూ ట్విట్ చేయ‌డం ఇప్ప‌డు ఫ్యాన్స్ మ‌ధ్య వార్ కు ప్ర‌ధాన కార‌ణంగా మారింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ .. మ‌హేష్ అన్నా అంటూ గౌన‌వంగా సంబోదిస్తుంటే చ‌రణ్ మాత్రం ఏక వ‌చ‌నంతో త‌న కంటే 9 ఏళ్లు పెద్దవాడైన మ‌హేష్ ని పిల‌వడం ఏమీ బాగాలేద‌ని మ‌హేష్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

9 ఏళ్ల సీనియ‌ర్ కు చ‌ర‌ణ్ ఇచ్చే గౌర‌వం ఇదేనా అంటూ నెట్టింట ట్వీట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. స‌ర్ ల‌ని కానీ మ‌హేష్ అన్న అని కానీ సంబోధించి వుంటే బాగుండేద‌ని, అలా కాకుండా పెద్ద వాడైన మ‌హేష్ ని ఏక వ‌చ‌నంతో మ‌హేష్ అంటూ పిల‌వ‌డం ఏమీ బాగాలేద‌ని మ‌హేష్ ఫ్యాన్స్ ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ పై ట్విట్ట‌ర్ వార్ ప్ర‌క‌టించారు.

ఇదే త‌ర‌హాలో మా హీరోని టార్గెట్ చేస్తారా? అంటూ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కూడా ఎదురుదాడికి దిగ‌డంతో ఇద్ద‌రు హీరోల అభిమానుల పిచ్చి పీక్స్ కి చేరింద‌ని కామెంట్ లు వినిపిస్తున్నాయి. `భ‌ర‌త్ అనే నేను` ప్రీ రిలీజ్ వేడుక ఎల్బీ స్టేడియంలో జ‌రిగింది. దీనికి ఎన్టీఆర్ గెస్ట్ గా వ‌చ్చాడు. ఇదే వేదిక‌పై మాట్లాడిన మ‌హేష్ `మేము మేము బాగానే వుంటాం మీరు మారాలి` అన్న‌ట్టుగా అభిమానులు ఎప్పుడు మార‌తారో అని అంతా సెటైర్లు వేస్తున్నారు.