Begin typing your search above and press return to search.

బర్త్ డే నాడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన మహేశ్..!

By:  Tupaki Desk   |   6 Aug 2021 7:41 AM GMT
బర్త్ డే నాడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన మహేశ్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఆగస్టు 9 అంటే పండుగ రోజు. ఎందుకంటే అది మహేష్ పుట్టినరోజు. రెండు వారాల క్రితమే సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన ఫ్యాన్స్.. మరో రెండు రోజుల్లో రానున్న బిగ్గెస్ట్ ఫెస్టివల్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా 'గ్రేట్ గో గ్రీన్ ఇనిషియేటివ్‌' తో ముందుకు వచ్చిన మహేశ్.. అందరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌ కుమార్‌ తలపెట్టిన 'గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌' కు మద్దతుగా తన బర్త్ డే నాడు ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలని మహేష్ బాబు కోరారు. పర్యావరణ సమతుల్యత కాపాడటానికి కాలుష్యాన్ని నివారించడానికి మొక్కలు నాటి తన మీద ప్రేమను తెలియపరచమని పేర్కొన్నారు.

''ఎల్లప్పుడూ నాపై మీకున్న ప్రేమను చూపించడానికి మీరు చేసే పనులన్నీ నాకు ఆనందాన్ని ఇస్తాయి. ఈ ఏడాది మిమ్మల్ని స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కు సపోర్ట్ గా ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలని మీ అందరినీ కోరుతున్నాను. మీ పోస్ట్‌ లలో నన్ను ట్యాగ్ చేయండి. నేను కూడా వాటిని చూడగలను'' అని మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ నోటీస్ పేరుతో విడుదలైన ఫస్ట్ లుక్ విశేష స్పందన తెచ్చుకుంది. దీని దెబ్బకు సోషల్ మీడియా రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయ్యాయి. ఈ క్రమంలో ఆగస్ట్ 9న సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ రాబోతోంది. దీని కోసం మహేష్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.