Begin typing your search above and press return to search.

కొడుకుగా చివరి బాధ్యత.. విజయవాడ చేరుకున్న మహేష్‌ బాబు

By:  Tupaki Desk   |   21 Nov 2022 9:32 AM GMT
కొడుకుగా చివరి బాధ్యత.. విజయవాడ చేరుకున్న మహేష్‌ బాబు
X
సూపర్ స్టార్‌ కృష్ణ ఈనెల 15న తుది శ్వాస విడిచిన విషయం తెల్సిందే. ఆయన మరణం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కూడా కన్నీరు మిగిల్చింది. మహేష్‌ బాబు కొడుకు గా అన్ని కార్యక్రమాలను దగ్గర ఉండి చూసుకున్నారు. మహేష్ బాబు చేతుల మీదుగా కృష్ణ యొక్క అంత్యక్రియలు జరిగిన విషయం కూడా తెల్సిందే. చిన్న కర్మ.. పెద్ద కర్మ అన్ని కూడా మహేష్‌ బాబు ముగించారు.

నేడు కృష్ణ హస్తికలను మహేష్ బాబు విజయవాడ లోని కృష్ణా నదిలో కలిపేందుకు వెళ్లారు. అక్కడకు కుటుంబ సమేతంగా మహేష్ బాబు వెళ్లారు. మహేష్ బాబు వెంట ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా కొందరు ఉన్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు విజయవాడలోని కృష్ణ నదిలో శాస్త్రోక్తంగా హస్తికలను కలిపి తిరిగి హైదరాబాద్‌ చేరుకోబోతున్నారు.

సాధారణంగా అయితే కృష్ణ పెద్ద కొడుకు అయిన రమేష్ బాబు ఇవన్నీ చేయాల్సి ఉంది. కానీ రమేష్ బాబు ఇటీవలే మృతి చెందాడు. దాంతో అన్నయ్య బాధ్యతలు అన్నీ కూడా తమ్ముడు అయిన మహేష్‌ బాబు నిర్వహించారు. మహేష్‌ బాబు చేతుల మీదుగా అంత్యక్రియలు జరగడంతో పాటు హస్తికలను కూడా ఆయన చేతుల మీదుగా కృష్ణ నదిలో నిమజ్జనం చేయడం జరిగింది.

మహేష్‌ బాబు ఈ కార్యక్రమాలు పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా షూటింగ్ కు హాజరు అవ్వబోతున్నాడు. తల్లి చనిపోయిన సమయంలో దాదాపుగా నెల రోజుల పాటు షూటింగ్ కార్యక్రమాలకు దూరంగా ఉన్న మహేష్ బాబు షూటింగ్ కు రెడీ అయిన సమయంలో అనూహ్యంగా కృష్ణ చనిపోయారు.

తండ్రి మరణం నేపథ్యంలో మళ్లీ త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌ కు మహేష్ బాబు హాజరు అవ్వలేక పోతున్నాడు. వచ్చే నెల ఆరంభం నుండి షూటింగ్‌ కు హాజరు అయ్యేలా మహేష్‌ బాబు డేట్లు ఇచ్చాడు అనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఆలస్యం అయిన ఈ సినిమా ను డిసెంబర్ లో మొదలు పెట్టి బ్రేక్ లేకుండా షూటింగ్‌ చేయబోతున్నారట. వచ్చే సమ్మర్‌ లో ఏప్రిల్‌ 28వ తారీకున విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.