Begin typing your search above and press return to search.

సురేంద‌ర్ రెడ్డి - ప‌వ‌న్ ప్రాజెక్ట్ పై మేక‌ర్స్ క్లారిటీ!

By:  Tupaki Desk   |   2 Sep 2022 6:06 AM GMT
సురేంద‌ర్ రెడ్డి - ప‌వ‌న్ ప్రాజెక్ట్ పై మేక‌ర్స్ క్లారిటీ!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం క్రిష్ జాగ‌ర్ల‌మూడి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస‌క్తున్న పీరియాడిక్ ఫిల్మ్‌ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం. ర‌త్నం స‌మ‌ర్ప‌ణ‌లో ఏ. దాయాక‌ర్ రావు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ న‌ర్గీస్ ఫ‌క్రీ 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో సాగే క‌థ‌కు అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్స్ ని జోడించి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఈ మూవీ తాజా షెడ్యూల్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుక్ర‌వారం మేక‌ర్స్ విడుద‌ల చేసిన ప‌వ‌ర్ గ్లాన్స్ టెర్రిఫిక్ గా వుండి ఫ్యాన్స్ కి పూన‌కాలు తెప్పిస్తోంది. తెలుగుతో పాటు ఈ మూవీని త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ మూవీతో పాటు ప‌వ‌న్ మ‌రో రెండు క్రేజీ ప్రాజెక్ట్ ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

ఇందులో ఎస్ ఆర్ టీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత రామ్ త‌ళ్లూరి నిర్మించ‌నున్న భారీ ప్రాజెక్ట్ ఒక‌టి. దీనికి స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ గురించి నెట్టింట చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌త కొంత కాలంగా ఇత‌ర ప్రాజెక్ట్ ల గురించి అప్ డేట్ లు వ‌స్తున్నా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఎలాంటి ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డంతో ఫ్యాన్స్ మేక‌ర్స్ ని నెట్టింట ప్ర‌శ్నిస్తున్నారు. రెండేళ్ల క్రితం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు.

కానీ ఇంత వ‌ర‌కు ఈ ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేదు. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అయినా అప్ డేట్ ఇవ్వ‌డండ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ్యాన్స్ మేక‌ర్స్ పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. దీంతో నిర్మాత రామ్ త‌ళ్లూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. ఓ అభిమాని `అన్నా ఇంత‌కీ మ‌న ప్రాజెక్ట్ వుందా లేదా? క్లారిటీ ఇవ్వ‌న్నా ` అని అడిగిన ప్ర‌శ్న‌కు రామ్ తాళ్లూరి స‌మాధానం చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ఖ‌చ్చితంగా వుంద‌ని, సురేంద‌ర్ రెడ్డి `ఏజెంట్` మూవీ పూర్తి చేశాక మ‌న సినిమా ప్రారంభం అవుతుంది` అని క్లారిటీ ఇచ్చారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌మిట్ మెంట్ ప్ర‌కారం ఈ మూవీ ఇప్ప‌ట్లో ప‌ట్టాలెక్క‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ప్రొడ్యూస‌ర్ రామ్ తళ్లూరి `ఏజెంట్‌` త‌రువాత మ‌న సినిమానే ప్రారంభిస్తామ‌ని అంత క్లారిటీగా ఎలా చెబుతున్నార‌న్న‌ది ఎవ‌రికి అర్థం కావ‌డం లేద‌ని ఇన్ సైడ్ టాక్‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.