Begin typing your search above and press return to search.

అతనితో ​మణిరత్నం.. 6వ సారి

By:  Tupaki Desk   |   10 July 2017 6:52 AM GMT
అతనితో ​మణిరత్నం.. 6వ సారి
X
కథ చెప్పడంలోనూ చూపడంలోనూ డైరెక్టర్ మణిరత్నం ఎంతటి ప్రతిభావంతుడో మనం ప్రత్యేకించి చెప్పవలిసిన పనిలేదు. చాలా భావాలును మణి రత్నం చెప్పినట్లుగా ఎవరూ చెప్పలేదు అనేది వాస్తవం. మరి అటువంటి కథకుడుకి ఒక మరో కథకుడు జతకడితే ఎలా ఉంటుంది అంటే ‘రోజా’ లాంటి ప్రేమ కావ్యం - ‘ఇద్దరు’ లాంటి రాజకీయ కథ - ‘విలన్’ - ‘దిల్ సే’ లాంటి వైవిధ్య కథలును అందంగా అద్భుతంగా చెప్పగలిగే వీలు ఏర్పడుతుంది. వీటన్నింటికీ మణిరత్నం వెనుక మరో క్రియేటివ్ వ్యక్తి వున్నాడు.

తన కెమెరాతో వెండితెర పై చరిత్రలో నిలిచిపోయేలా కొన్ని కావ్యాలను రాసిన డైరెక్టర్ మరియు సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్. గతంలో దళపతి.. రోజా.. ఇద్దరు.. దిల్ సే.. విలన్ సినిమాలకు కలసి పనిచేసన మణిరత్నం అండ్ సంతోష్‌ శివన్.. మరోసారి కలసి సత్తాచాటనున్నారు. ‘ఓకే బంగారం’ సినిమాతో మళ్ళీ తన మ్యాజిక్ ని రిపీట్ చేసిన మణి నిన్న ‘చెలియా’ సినిమాతో డీలా పడ్డాడు. ఈసారి అలా జరగకూడదు అని గట్టి పట్టుదలతో పని మొదలుపెట్టాడు. ఆ పనిలో తన కొత్త సినిమాకు స్టార్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ను ఎన్నుకొన్నాడట. ఇప్పుడు రాబోతున్న సినిమా వీళ్ళ కాంబినేషన్లో 6వ సినిమా. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరో తెలియదు కాని.. ప్రస్తుతానికి రామ్ చరణ్‌ వంటి స్టార్లు మణికి హ్యాండిచ్చిన సంగతి తెలిసిందే.

ఇకపోతే సంతోష్ శివన్ ఇప్పుడు తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు తమిళ్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న ‘స్పైడర్’ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. సంతోష్ శివన్ డైరెక్ట్ చేసిన ‘ఊరుమి’ వంటి ప్రాజెక్టులు ఫ్లాపైనా కూడా విజువల్ గా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మరోసారి మణి-సంతోష్‌ కాంబో కలిసి ఎటువంటి దృశ్యకావ్యాన్ని మనకు అందించబోతున్నారో ఆ సినిమా విశేషాలు ఏంటో తెలుసుకోవాలి అంటే కొన్ని రోజులు ఆగవలిసిందే.​