Begin typing your search above and press return to search.

మహేష్‌ సరసన జాక్‌పాట్‌??

By:  Tupaki Desk   |   9 Jun 2015 12:04 PM IST
మహేష్‌ సరసన జాక్‌పాట్‌??
X
బార్బీ హండా అలియాస్‌ మన్నారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇండియన్‌ ఐడల్‌, గాయకుడు శ్రీరామ్‌ చంద్ర సరసన ప్రేమా గీమా జాన్తా నయ్‌.. సినిమాలో నటించింది. తొలి ప్రయత్నమే ఆశించినంత విజయం సాధించకపోవడంతో అవకాశాలు రాలేక్కడ. అయితే బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా కజిన్‌ అన్న హైప్‌తో వరుసగా అవకాశాలు అందుకుంటోంది.

ఇటీవలే జిద్‌ అనే ఎరోటిక్‌ థ్రిల్లర్‌లో నటించి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. ఈ చిత్రంలో శ్రద్ధాదాస్‌తో కలిసి పోటాపోటీగా నటించింది. మన్నారా గరమగరమ ఫోజులతో యువతరం గుండెల్లో చిచ్చుపెట్టి బాక్సాఫీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించింది. ఈ రెండు సినిమాలతో అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది రెండుచోట్లా ఈ అమ్మడి పేరు మార్మోగింది. సైలెంటుగా ఉత్తరాదిన కెరీర్‌ ప్లాన్‌ చేసుకుంటున్న ఈ భామకు ఉన్నట్టుండి జాక్‌పాట్‌ తగిలింది. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన కథానాయికగా నటించే అవకాశం వచ్చిందని టాక్‌.

మహేష్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న 'బ్రహ్మూెత్సవం' చిత్రంలో ఒక నాయికగా ఈ భామ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. రకూల్‌ప్రీత్‌, ప్రణీత ఇప్పటికే నాయికలు అని వార్తలొచ్చిన నేపథ్యంలో మన్నారా నటించేది రెండో నాయికగానా? లేక మూడో నాయికగానా? ఐటెమ్‌ భామగానా? అన్నదాంట్లో క్లారిటీ లేవాల్సి ఉంది.